BRS Sarpanch Navya latest News(Telangana today news) : ఎంఎల్ఎ తాటికొండ రాజయ్యకు.. జానకీ పురం సర్పంచ్ నవ్య మధ్య చెరలేగిన వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. గతంలో రాజయ్య తనను లైంగికంగా వేధించాడని సంచలన ఆరోపణలు చేసిన నవ్యకి.. బెదిరింపులు మొదలయ్యాయి. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించారు.
స్టేషన్ ఘన్పూర్ ఎంఎల్ఎ తాటికొండ రాజయ్యతోపాటు ఆయన పీఏ శ్రీనివాస్, స్థానిక ఎంపీపీ నిమ్మ కవిత నుంచి తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని ఆరోపించారు సర్పంచ్ నవ్య. వారి నుంచి తనను, తన కుటుంబసభ్యులను చంపుతామని బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఆమె.. హన్మకొండ జిల్లా ధర్మసాగర్ సీఐ రమేశ్ కి ఫిర్యాదు చేశారు. నాలుగు రోజుల్లో తమను చంపుతామని బెదిరించినట్లు సర్పంచ్ నవ్య ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఇక తాను ఈ ఎమ్మెల్యే రాజయ్య వ్యవహారాన్ని బయటపెట్టినప్పటి నుంచి తనకు ఆయన అనుచరులు నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నట్లు సర్పంచ్ నవ్య పోలీసులకు తెలిపారు. ఈ క్రమంలో తనతో అసభ్యంగా మాట్లాడిన కాల్ వాయిస్ రికార్డ్స్ ను, నెంబర్లను ఆమె పోలీసులకు అందించారు. తమకు పోలీసులపై పూర్తి నమ్మకం ఉందన్న సర్పంచ్ నవ్య.. సరైన న్యాయం జరగకపోతే.. కోర్టులను, మహిళా కమిషన్ ను ఆశ్రయిస్తానని స్పష్టం చేశారు.