Sonia Gandhi : రాజకీయాల నుంచి కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ వైదొలగుతారనే వార్తలపై కాంగ్రెస్ పార్టీ క్లారిటీ ఇచ్చింది. ఛత్తీస్ గడ్ రాజధాని రాయ్పూర్లో కాంగ్రెస్ పార్టీ 85వ ప్లీనరీ సమావేశాల్లో ప్రసంగించిన సోనియా.. భారత్ జోడో యాత్ర విజయవంతం కావడంతో తన ఇన్నింగ్స్ ముగిసిందని ప్రకటించారు. దీంతో ఆమె ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకున్నారని అందరూ భావించారు.
సోనియా రాజకీయాల నుంచి తప్పుకున్నారని అన్ని మీడియాల్లో కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సోనియా రిటర్మెంట్ పై కాంగ్రెస్ శ్రేణుల్లో అయోమయం నెలకొంది. దీంతో ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ వివరణ ఇచ్చింది. సోనియా గాంధీ వ్యాఖ్యలను మీడియా సంస్థలు తప్పుగా అర్థం చేసుకున్నాయని తెలిపింది. ఆమె ప్రత్యక్ష రాజకీయాల నుంచి వైదొలగడంలేదని కాంగ్రెస్ పార్టీ ప్రకటన విడుదల చేసింది.
సోనియా రాజకీయాల్లో నుంచి తప్పుకోవడం లేదని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అల్కా లంబా స్పష్టం చేశారు. సోనియా ప్రసంగంపై ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా కథనాలు రాయొద్దని మీడియాను కోరారు. సోనియా కేవలం పార్టీ అధ్యక్ష పదవికి మాత్రమే దూరంగా ఉండాలకుంటున్నారని ఆ విషయాన్నే చెప్పారని లంబా తెలిపారు. రాజకీయాల నుంచి తప్పుకొంటున్నట్లు చెప్పలేదన్నారు. రాజకీయాల నుంచి రిటైర్మెంట్ వార్తల గురించి వినగానే సోనియా గాంధీ నవ్వారని… తానెప్పుడూ రాజకీయాల నుంచి తప్పుకోలేదని తప్పుకోనని స్పష్టం చేశారని వివరించారు. ఈ విషయాన్ని మీడియా గమనించాలని అల్కా లంబా సూచించారు.
2004, 2009 ఎన్నికల్లో పార్టీ విజయం, మన్మోహన్ సింగ్ అందించిన సమర్థ నాయకత్వం వ్యక్తిగతంగా సంతృప్తి కలిగించిందని రాయ్ పూర్ సభలో సోనియా చెప్పారు. భారత్ జోడో యాత్ర ముగింపుతో తన ఇన్నింగ్స్ ముగియడం ఎంతో ఆనందాన్ని ఇస్తోందన్నారు. దేశ ప్రజలు సామరస్యం, సమానత్వాన్ని కోరుకుంటున్నారని ఈ యాత్ర ద్వారా రుజువైందని చెప్పారు. ప్రజల పక్షాన కాంగ్రెస్ పోరాటాన్ని కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో సోనియా రాజకీయాల నుంచి తప్పుకున్నారని వార్తలు వచ్చాయి. దీంతో సోనియా రాజకీయాల నుంచి తప్పుకోవడంలేదని పూర్తి స్పష్టతను కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది.
Manish Sisodia: ఢిల్లీ లిక్కర్ స్కామ్..మనీష్ సిసోడియా అరెస్ట్..