Birds Migration : చాలావరకు పక్షులు ఒక ప్రాంతాన్ని తమ ఇల్లులాగా భావించి అక్కడే జీవనాన్ని కొనసాగిస్తాయి. అంతే కాకుండా ఒకే దారిలో ప్రయాణిస్తాయి. అది దాటి వేరే ప్రాంతానికి వెళ్లడానికి పక్షులు మొగ్గుచూపవు. కానీ ఈమధ్యకాలంలో చాలావరకు పక్షులు తమ ప్రాంతాలను వీడి, వాటికి అలవాటు లేని ప్రాంతానికి ప్రయాణిస్తాయి. దీనికి కారణమేంటో శాస్త్రవేత్తలు పరిశోధించారు.
మామూలుగా సముద్రపు డేగలు పాసిఫిక్ మహాసముద్రాన్ని దాటి ఎగరవు. కానీ ఈమధ్య అవి పాసిఫిక్ను దాటి వేరే ప్రాంతానికి వలస వెళుతున్నట్టుగా శాస్త్రవేత్తలు గమనించారు. అది ఎందుకో తెలుసుకోవడానికి వారు కొత్త స్టడీని మొదలుపెట్టారు. వాతావరణ మార్పులే దీనికి కారణం అయ్యిండవచ్చన్న వారి అనుమానం నిజమయ్యింది.
గత 60 ఏళ్లలో వాతావరణంలో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. అప్పటినుండి పక్షులు వలసవెళ్లడం మొదలుపెట్టాయి. నార్త్ అమెరికా నుండి గత 60 ఏళ్లలో దాదాపు 20 లక్షలకు పైగా పక్షులు ఇతర ప్రాంతాలకు వలసవెళ్లినట్టుగా శాస్త్రవేత్తలు గుర్తించారు. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, లాస్ ఏంజెల్స్ శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల్లో ఈ విషయం బయటపడింది.
భూమి మ్యగ్నటిక్ ఫీల్డ్లో మార్పులు రావడం వల్ల పక్షులు తాము ఎప్పుడూ చూడని ప్రాంతాలకు కూడా వలసవెళుతున్నాయి. ఇలా వలసవెళడం కొన్ని రకాల పక్షులకు మంచి చేసినా.. చాలా ఇతర రకాల పక్షులకు నష్టమే కలిగిస్తుందని శాస్త్రవేత్తలతో పాటు, పర్యావరణవేత్తలు కూడా భావిస్తున్నారు. వాతావరణం అనుకూలంగా ఉంటే గానీ ఈ వలసలు ఆగవని వారు అంటున్నారు
Follow this link for more updates:- Bigtv