Big Stories

Viral Video: పూజ కోసం కర్రను తీసుకుని ఇంట్లోకి వెళ్లాడు.. కర్రకు వైర్ తగిలి కుప్పకూలాడు

Viral Video: ప్రమాదాలు ఎప్పుడూ ఏ రూపంలో వస్తున్నాయో కూడా అర్థం కావడం లేదు. అప్పటి వరకు సంతోషంగా ఉండే మనుషులు ఒక్కసారిగా ప్రాణాలను కోల్పోతున్నారు. ఇలా కరోనా సమయం తరువాత చాలా ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే తాజాగా ఇలాంటిదే ఓ ప్రమాదకర ఘటన తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి అప్పటి వరకు బాగానే ఉండి ఒక్కసారిగా కరెంట్ షాక్‌తో కుప్పకూలిపోయిన ఘటన ఒకటి అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

- Advertisement -

ఉత్తర్ ప్రదేశ్ లో తాజాగా ఈ ఘటన వెలుగుచూసింది. ఓ వ్యక్తి ఇంట్లో పూజ కోసం ఏకంగా ఓ పొడవున్న కర్రను తీసుకుని వెళ్లాడు. ఈ తరుణంలో ఆ కర్ర కరెంటు వైరుకు తగిలి ఒక్కసారిగా షాక్ కొట్టి కుప్పకూలాడు. మృతుడి పేరు దేవేంద్ర(35)గా గుర్తించారు. జసోదా నంగర్ కు చెందిన సువేంద్ర సింగ్ ఇంట్లో మంగళవారం ఓ పూజా కార్యక్రమం జరిగింది. ఈ రతుణంలో చందోన్ గ్రామానికి చెందిన దేవేంద్ర ఈ పూజా కార్యక్రమం కోసం బంధువుల ఇంటికి వెళ్లాడు. ఈ తరుణంలో పూజా కార్యక్రమంలో భాగంగా ఓ పొడవాటి కర్రను తీసుకుని వెళ్లాడు. దీంతో ఆ కర్రను ఇంట్లోకి తీసుకుని వెళ్తున్న క్రమంలో ఒక్కసారిగా ఇంటి బయట ఉన్న కరెంటు వైరుకు తగిలి షాక్ వచ్చింది. దీంతో అక్కడికి అక్కడే మృతి చెందాడు. అయితే ముందుగా అతడి మరణం చూసి గుండెపోటు అనుకున్నారు. కానీ సీసీటీవీ ఫుటేజ్ చూడగా అక్కడే ఉన్న కరెంటు వైర్ తగిలి షాక్ వచ్చింది.

- Advertisement -

అయితే కరెంటు షాక్ తగిలిన వెంటనే చికిత్స నిమిత్తం దేవేంద్రను ఆసుపత్రికి తరలించారు. కానీ అసలు ఉపయోగం లేకుండా పోయింది. అప్పటికే ఆ వ్యక్తి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా ఈ ప్రమాదం జరిగిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News