Big Stories

Train Viral Video: కదులుతున్న రైలుపై నీళ్లు చల్లిన కుర్రాళ్లు.. ప్రయాణికుల రియాక్షన్ చూస్తే షాక్

Train Viral Video: కొంత మంది యువకులు ఎప్పుడూ ఆకతాయి పనులు చేస్తూ అందరినీ ఆటపట్టిస్తుంటారు. ఎప్పుడూ ఏదో ఒక పనిచేస్తూ అందులో ఆనందాన్ని వెతుక్కుంటూ ఉంటారు. ముఖ్యంగా ఇప్పుడు ఉన్న యువత మాత్రం ఇలాంటి ఆకతాయి పనులు చేస్తూ సోషల్ మీడియాలో వీడియోలను పోస్ట్ చేస్తూనే ఉన్నారు. అయితే తాజాగా కదులుతున్న రైలుపై కొంతమంది యువకులు చేసిన పని ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఘటన పాకిస్థాన్‌లో వెలుగుచూసింది.

- Advertisement -

కదులుతున్న రైలుపై కొంత మంది యువకులు ఒక ప్రాంతంలో నుండి నీళ్లను చల్లేందుకు ప్రయత్నించారు. ఈ తరుణంలో వంతెన కింద ఉన్న ఒక వాగులో కొంత మంది యువకులు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అయితే రైలు వస్తున్న సమయం చూసిన వారు తమ బైక్ ను వాటర్ పెట్టి ఆన్ చేసి ఉంచారు. ఈ తరుణంలో నీళ్లు పట్టాలపై నుండి వెళ్లే రైలుపై పడేలా చేశారు. దీంతో అప్పుడే వస్తున్న రైలుపై ఒక్కసారిగా నీళ్లు పడడం ప్రారంభమైంది. దీంతో ప్రయాణికులు తమపై నీళ్లు పడడం వల్ల ఒక్కసారిగా షాక్ అయ్యారు.

- Advertisement -

బయట యువకులు చేస్తున్న పని చూసిన ప్రయాణికులు ఆశ్చర్యపోయారు. దీంతో వెంటనే రైలు ఆపి కిందకు దిగారు. నీళ్లతో తడిపేసినందుకు వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రయాణికులు యువకులపై దాడి చేసి వారి వద్ద బైకును లాక్కున్నారు. ఈ తరుణంలో ప్రయాణికులు, యువకుల మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం వెలుగుచూసింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. యువకులు చేసిన పనికి నెటిజన్లు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News