Secunderabad news today telugu(TS news updates): సైకో భర్త వేధింపులు భరించలేకపోయింది. అందంగా లేవని అవమానించేవాడు. అదనపు కట్నం తీసుకురావాలని టార్చర్ చేసేవాడు. అప్పటికే ఇద్దరు కవల పిల్లలు ఉన్నా.. తీరు మారలేదు. అల్లుడి బలవంతంతో.. తాముంటున్న ఫ్లాట్ రాసిచ్చారు ఆమె పేరెంట్స్. అయినా, ఆ శాడిస్ట్ హజ్బెండ్ ధన దాహం తీరనేలేదు. మరిన్ని డబ్బుల కోసం మరింతగా వేధించాడు.
ఇక తట్టుకోలేకపోయింది ఆ భార్య. అత్తింటి నుంచి పుట్టింటికి వచ్చేసింది. తాను బతకలేనంటూ.. 8వ అంతస్తు నుంచి పిల్లలను కిందకు తోసేసింది. ఆ తర్వాత తానూ బిల్డింగ్ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది.
సికింద్రబాద్, బన్సీలాల్పేట్లోని డబుల్ బెడ్రూమ్ ఇండ్ల సముదాయంలో జరిగిందీ దారుణ ఘట. సమాచారం అందుకున్న పోలీసులు.. తల్లి, పిల్లల మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.