Big Stories

Congress : కాంగ్రెస్ వార్ రూమ్ కేసులో ట్విస్ట్.. ఉత్తమ్ ఫిర్యాదుతోనే దాడులు..

- Advertisement -

Congress war room case(Latest Political News Telangana):- యూత్‌ కాంగ్రెస్‌ సోషల్‌ మీడియా వార్‌ రూమ్‌పై పోలీసుల దాడి తెలంగాణలో తీవ్ర కలకలం రేపుతోంది. అయితే ఈ కేసులో ట్విస్ట్ వెలుగు చూసింది. కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిర్యాదుతోనే దాడులు చేశామని పోలీసులు అంటున్నారు.

- Advertisement -

సోషల్‌ మీడియాలో తనను కించపరిచేలా పోస్ట్‌లు పెడుతున్నారని ఉత్తమ్ ఫిర్యాదు చేశారని పోలీసులు తెలిపారు. మే 5న ఆయన సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారని అంటున్నారు. దీంతో ఐపీ అడ్రస్ ఆధారంగా వార్ రూమ్‌పై దాడులు చేశామని పోలీసులు వెల్లడించారు.

కర్ణాటక ఎన్నికల్లో అక్కడ యూత్ కాంగ్రెస్ బాగా పనిచేసింది. అదే విధంగా తెలంగాణలోనూ యూత్ కాంగ్రెస్ పని చేస్తోంది. ఈ దాడి కేసీఆర్ సర్కార్ కుట్ర పూరితంగా చేయించిందని తొలుత యూత్ కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. మరి కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు చేయడంతో పార్టీలో అలజడి రేగింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News