TSPSC group 1 prelims key Updates(Latest news in telangana) : గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ప్రాథమిక కీ విడుదలకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కసరత్తు చేస్తోంది. మాస్టర్ ప్రశ్నపత్రం, ప్రాథమిక కీని త్వరలోనే వెబ్సైట్ లో పెట్టేందుకు ఏర్పాట్లు చేస్తోంది. త్వరగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తోంది. ఆ తర్వాత తుది కీ విడుదల చేయనుంది. అనంతరం మూల్యాంకనం చేపట్టి ఫలితాలు వెల్లడించాలని యోచిస్తోంది. నెల రోజుల్లోగా ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఆ తర్వాత 3 నెలలకు మెయిన్స్ పరీక్ష నిర్వహించనుంది.
సెప్టెంబర్ నెలాఖరు వరకు ఇతర పోటీ పరీక్షలు ఉన్నాయి. అందుకే అక్టోబర్ లేదా నవంబర్ లో గ్రూపు-1 మెయిన్స్ నిర్వహిస్తారని తెలుస్తోంది. ఆదివారం జరిగిన గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు.. రద్దై గత ఎగ్జామ్ తో పోల్చితే 50 వేల మంది తక్కువగా హాజరయ్యారు.
ప్రశ్నపత్రాల లీకేజీ నేపథ్యంలో టీఎస్పీఎస్సీ అనేక సంస్కరణలు చేపట్టింది. కమిషన్ ఉద్యోగులు పరీక్షలు రాస్తే వారిని నిర్బంధ సెలవులో పంపించాలని నిర్ణయించింది. తాజాగా గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు 10 మంది ఉద్యోగులు దరఖాస్తు చేశారు. వారిని పరీక్ష తేదీకి 2 నెలల ముందు, పరీక్ష తర్వాత నెల రోజుల వరకు ఉద్యోగాలకు సెలవు పెట్టించింది.