Telangana high court news(TS news updates): బీఆర్ఎస్ ఎంపీ,హెటిరో ఛైర్మన్ పార్థసారథి రెడ్డికి చెందిన సాయిసింధు ఫౌండేషన్కు భూ కేటాయింపులపై తెలంగాణ హైకోర్టులో కీలక తీర్పు ఇచ్చింది. ప్రభుత్వం చేసిన భూకేటాయింపులను రద్దు చేసింది. ఈ ఫౌండేషన్కు మేనేజింగ్ ట్రస్టీగా పార్థసారథిరెడ్డి ఉన్నారు.
2018లో హైదరాబాద్ ఖానామెట్ వద్ద క్యాన్సర్ ఆస్పత్రి నిర్మాణం కోసం 15 ఎకరాల భూమిని తెలంగాణ ప్రభుత్వం సాయిసింధు ఫౌండేషన్ కు కేటాయించింది. ఆ
జీవోను సవాల్ చేస్తూ 2019లో హైకోర్టులో కొందరు ప్రజా ప్రయోజన పిటిషన్ దాఖలు చేశారు. రైట్ సొసైటీ, ఊర్మిళ, సురేశ్కుమార్ ఈ పిల్ వేశారు.
ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ విజయ్సేన్రెడ్డి ధర్మాసనం భూ కేటాయింపును రద్దు చేస్తూ తీర్పు ఇచ్చింది. ప్రభుత్వం జారీ చేసిన జీవోను ధర్మాసనం కొట్టివేసింది. భూ కేటాయింపుల విధానానికి అనుగుణంగా మళ్లీ పరిశీలన చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.