Big Stories

BRS MLA KTR: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్‌కు హైకోర్టు నోటీసులు!

Notices to BRS MLA KTR: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ కు రాష్ట్ర హైకోర్టు నోటీసులు జారీ చేసింది. నామినేషన్ సందర్భంగా కేటీఆర్ సమర్పించినటువంటి ఎన్నికల అఫిడవిట్లలో తప్పుడు ప్రచారం ఉందంటూ కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డి, లగిశెట్టి శ్రీనివాసులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన న్యాయమూర్తి జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు.. నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని కేటీఆర్ తోపాటు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి, సిరిసిల్ల రిటర్నింగ్ ఆఫీసర్ కు నోటీసులు జారీ చేశారు. తదుపరి విచారణను హైకోర్టు వాయిదా వేసింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News