EPAPER

Sunil Reddy : ఢిల్లీలో ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత.. కాంగ్రెస్ లో చేరేందుకు ప్రయత్నాలు..

Sunil Reddy : ఢిల్లీలో ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత.. కాంగ్రెస్ లో చేరేందుకు ప్రయత్నాలు..

Political news today telangana: తెలంగాణ కాంగ్రెస్‌లో చేరికలు కొనసాగుతున్నాయి. ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత సునీల్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో ఢిల్లీ వెళ్లి భేటీ అయ్యారు. కాంగ్రెస్‌లో చేరతానని టీపీసీసీ చీఫ్‌కు చెప్పారు. జిల్లా నేతలతో చర్చించిన తర్వాతే నిర్ణయం చెబుతామని రేవంత్ స్పష్టంచేశారు.


గత ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్ కోసం సునీల్‌ రెడ్డి తీవ్రంగా ప్రయత్నించారు. టికెట్ దక్కకపోవడంతో బాల్కొండ నియోజకవర్గం నుంచి బీఎస్పీ తరఫున బరిలోకి దిగారు. ఆ ఎన్నికల్లో ఓడిపోయినా మంత్రి ప్రశాంత్ రెడ్డికి గట్టి పోటీ ఇచ్చారు. కాంగ్రెస్ అభ్యర్థిని వెనక్కి నెట్టి రెండోస్థానంలో నిలిచారు. 2018 ఎన్నికల్లో సునీల్ రెడ్డి 27 శాతం పైగా ఓట్లు సాధించారు.

కొంతకాలంగా బీజేపీలో చేరడానికి సునీల్‌రెడ్డి ప్రయత్నాలు చేశారు. ఆయన చేరికను నిజమాబాద్ ఎంపీ అర్వింద్ అడ్డుకున్నారని టాక్ వినిపించింది. కర్ణాటక ఎన్నికల తర్వాత మారిన పరిణామాల నేపథ్యంలో సునీల్ రెడ్డి కూడా కాంగ్రెస్ చేరేందుకే మొగ్గు చూపుతున్నారు. స్థానిక నాయకత్వం అంగీకరిస్తేనే కాంగ్రెస్ కండువా కప్పుతామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.


ఢిల్లీ కాంగ్రెస్ ముఖ్య నాయకులతో సునీల్ రెడ్డి భేటీ అవుతారని తెలుస్తోంది. ఆయన పార్టీలో చేరికపై త్వరలో అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

Related News

Bigg Boss: హౌస్ నుంచి ఎలిమినేట్ కానున్న అభయ్.. 3 వారాలకు పారితోషకం ఎంతంటే..?

Tollywood Heroine: రహస్యంగా తల్లికి ఇష్టం లేని పెళ్లి.. కట్ చేస్తే..!

Madhavi Latha: నాగబాబుకి కూడా కూతురు ఉంది మర్చిపోయారా.. ట్రోలర్స్ పై గట్టి కౌంటర్..?

ANR Award: మెగాస్టార్ కి అవార్డ్.. ఆ రోజే ప్రధానోత్సవం అంటూ ప్రకటించిన నాగ్..!

Jani Master: అవును.. నేను చేసింది తప్పే.. పోలీసుల ముందు నేరం అంగీకరించిన జానీ..!

Star Heroine: ఈ హీరోయిన్ క్రేజ్ మామూలుగా లేదుగా.. 50 సెకండ్ల కోసం రూ.5కోట్లా..?

Fear Teaser: సస్పెన్స్ థ్రిల్లర్ గా ఫియర్ టీజర్.. అద్భుతమైన పర్ఫామెన్స్ తో హైప్ పెంచేసిన వేదిక.!

Big Stories

×