EPAPER

Delhi Liquor Scam: కవితకు మూడినట్టేనా?.. అప్రూవర్‌గా మారిన శరత్‌చంద్రారెడ్డి..

Delhi Liquor Scam: కవితకు మూడినట్టేనా?.. అప్రూవర్‌గా మారిన శరత్‌చంద్రారెడ్డి..
sarath chandra reddy

Delhi Liquor Case Latest News(Telugu breaking news today): ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక మలుపు. నిందితుడు శరత్‌ చంద్రారెడ్డి అప్రూవర్‌గా మారారు. తాను అప్రూవర్‌గా మారుతానంటూ కోర్టును రిక్వెస్ట్ చేయగా.. అందుకు న్యాయస్థానం అంగీకారం తెలిపింది. భార్య అనారోగ్యం కారణంగా ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు శరత్ చంద్రారెడ్డి. ఇప్పటికే ఆయన వాంగ్మూలం నమోదు చేసుకుంది ఈడీ.


శరత్ చంద్రారెడ్డి అప్రూవర్‌గా మారడం.. ఎమ్మెల్సీ కవితకు షాకింగ్ పరిణామమే అంటున్నారు. ఇప్పటికే కవిత ఆడిటర్ బుచ్చిబాబును విచారించి వివరాలు సేకరించింది. ఇప్పుడు శరత్ చంద్రారెడ్డి అప్రూవర్‌గా మారడం కవితకు మరిన్ని ఇబ్బందులు తప్పకపోవచ్చని తెలుస్తోంది. సౌత్ గ్రూప్ తరఫున కవితతో పాటు శరత్ చంద్రారెడ్డి సైతం ఢిల్లీ లిక్కర్ దందాలో భారీగా పెట్టుబడులు పెట్టారని ఈడీ ఆరోపణ. ఆప్‌కు ముడుపులు అందించిన వారిలో శరత్ కూడా ముందున్నారు. ఇప్పుడాయన అప్రూవర్‌గా మారడంతో.. లిక్కర్ స్కాంలో కవిత పాత్రపై మరింత కీలక సమాచారం ఈడీకి చేరనుంది. అసలు, కవితకు ఉచ్చు బిగించేందుకే.. శరత్ చంద్రారెడ్డిని ఈడీ అప్రూవర్‌గా మార్చిందనే వాదనా ఉంది.


Related News

Exist Polls Result 2024: బీజేపీకి షాక్.. ఆ రెండు రాష్ట్రాలూ కాంగ్రెస్‌కే, ఎగ్జిట్ పోల్స్ ఫలితాలివే!

Hand Foot Mouth: రాష్ట్రంలో ‘హ్యాండ్ ఫుట్ మౌత్’ కలకలం.. వ్యాధి లక్షణాలు ఇవే!

Hyderabad Real Boom: ఆ అందాల వలయంలో చిక్కుకుంటే మోసపోతారు.. హైదరాబాద్‌లో ఇల్లు కొనేముందు ఇవి తెలుసుకోండి

DSC Results 2024: డీఎస్సీ ఫలితాలను రిలీజ్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి.. కేవలం 56 రోజుల్లోనే!

 Rice Prices: సామాన్యులకు మరో షాక్.. భారీగా పెరగనున్న బియ్యం ధరలు!

Nepal Floods: నేపాల్‌లో వరదలు.. 150 మంది మృతి.. బీహార్‌కు హెచ్చరికలు

PM Modi: తెలంగాణపై ప్రశంసల వర్షం.. మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

×