Telangana high court latest judgement(TS news updates): తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ములుగు జిల్లా మంగపేట మండలంలోని 23 గ్రామాలపై చారిత్రక తీర్పు వెలువరించింది. 23 గ్రామాలు రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ పరిధిలోకే వస్తాయని హైకోర్టు స్పష్టం చేసింది. చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ఈ తీర్పు వెలువరించారు.
ఆ గ్రామాలపై హక్కుల కోసం 75 సంవత్సరాలుగా ఆదివాసీలు సుదీర్ఘ పోరాటం చేస్తున్నారు. ఆదివాసుల తరపు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినిపించారు. ఆ గ్రామాలు ఐదో షెడ్యూల్ పరిధిలోకి రావని ఆదివాసీయేతరులు వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత ఆదివాసీలకు అనుకూలంగా హైకోర్టు తీర్పు ఇచ్చింది.
ఆ 23 గ్రామాల్లో ఇక నుంచి ఆదివాసీలకే అన్ని హక్కులు దక్కనున్నాయి. ఆదివాసీలకు 100 శాతం రిజర్వేషన్లు అమలులోకి రానున్నాయి.