Sejal durgam chinnaiah latest news(Breaking news updates in telangana): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై లైంగిక ఆరోపణలు చేసిన ఆరిజిన్ డెయిరీ సీఈవో బోడపాటి శేజల్ అపస్మారక స్థితిలోకి వెళ్లింది. జూబ్లీహిల్స్లోని పెద్దమ్మగుడి వద్ద పడి ఉన్న ఆమెను స్థానికులు గుర్తించారు . వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలికి పోలీసులు చేరుకుని
ఆమెను ఆటోలో హాస్పటల్ కు తరలించారు.
శేజల్ బ్యాగ్లో నిద్రమాత్రలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. గురువారం మధ్యాహ్నం ఒకటిన్నర సమయంలో ఆమెను పెద్దమ్మగుడి వద్ద ఎవరో దించి వెళ్లారని స్థానికులు అంటున్నారు. శేజల్ ఆత్మహత్యాయత్నం చేసిందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆమె వద్ద ఒకలేఖ లభ్యమైంది. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. 6 నెలలుగా పోరాడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ప్రభుత్వంపై నమ్మకం లేదని లేఖలో శేజల్ స్పష్టం చేశారు.
ఆమె గత కొంతకాలంగా ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై ఆరోపణలు చేస్తున్నారు. తమను లైగింకంగా వేధించారని ఫిర్యాదు చేశారు. ఢిల్లీకి కూడా వెళ్లి పోరాటం చేశారు. ఈ క్రమంలోనే గతంలో ఒకసారి ఢిల్లీలో శేజల్ ఆత్మహత్యాయత్నం చేశారు.