Sridhar : సంధ్యా కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను ఉప్పరపల్లి కోర్టులో హాజరుపర్చారు. ట్రాన్సిట్ వారెంట్ అనుమతి కోరుతూ ఢిల్లీ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు.
తమను రూ. 250 కోట్ల మేర మోసం చేశారంటూ శ్రీధర్ పై ప్రముఖ బాలీవుడ్ సినీ నటుడు అమితాబ్ బచ్చన్ బంధువులు ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఢిల్లీ పోలీసులు హైదరాబాద్ కు వచ్చి ఆయన్ని అరెస్ట్ చేశారు. ఎస్కార్ట్ కంపెనీ మాజీ వైస్ ప్రెసిడెంట్ అనిల్ నందా ఫిర్యాదుతో సంధ్యా శ్రీధర్పై కేసు నమోదైంది. ఢిల్లీ, లూథియానాలో ఉన్న భూములను ఫోర్జరీ సంతకాలతో శ్రీధర్ అమ్మినట్లు ఆరోపణలు వచ్చాయి. రూ.180 కోట్లు చెల్లించినట్లు తన దగ్గర డాక్యుమెంట్లు ఉన్నాయని, అమితాబచ్చన్ బంధువులను మోసం చేయలేదని శ్రీధర్ అంటున్నారు. న్యాయ పోరాటం చేస్తానన్నారు.
మరోవైపు శ్రీధర్ పై ఇప్పటికే అనేక కేసులు ఉన్నాయి. గతంలోనూ ఆయన రెండుసార్లు అరెస్టయ్యారు. అరెస్టు అనంతరం శ్రీధర్ ను పోలీసులు ఎయిర్ పోర్ట్ పోలీస్ స్టేషన్ నుండి ప్రైవేట్ వాహనంలో రాజేంద్రనగర్ కోర్టుకు తరలించారు.
Gang Rape : మహిళ కిడ్నాప్.. కారులో గ్యాంగ్ రేప్.. హైదరాబాద్లో దారుణం..
Sayanna : ఎమ్మెల్యే సాయన్న పార్థివదేహానికి ప్రముఖులు నివాళులు..