Revanthreddy cabinet meeting(Telangana congress news): తెలంగాణలో రైతులకు శుభవార్త చెప్పేందుకు సిద్ధమవుతోంది రేవంత్ సర్కార్. తమ సర్కార్ రైతులకు మొదటి నుంచి అండగా ఉంటుందని సీఎం రేవంత్రెడ్డి పదేపదే చెప్పుకొచ్చారు. తాజాగా రేవంత్రెడ్డి మంత్రివర్గం శుక్రవారం సాయంత్రం భేటీ కానుంది.
ముఖ్యమంత్రి అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ భేటీ జరగనుంది. ఆగష్టు 15వ నాటికి ముందే రుణమాఫీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఈ సందర్భంగా రుణమాఫీ అమలుపై చర్చించి, మార్గదర్శకాలను ఆమోదించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అర్హులైన వారికి రుణమాఫీ వర్తింపజేయాలని అధికారులు ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నారు.
ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించేవారు, ఉద్యోగులను దీని నుంచి మినహా యించాలని ఆలోచన చేస్తోంది. అలాగే బడ్జెట్ రూపకల్పన, అసెంబ్లీ సమావేశాలు, బిల్లులపై చర్చించే అవకాశమున్నట్లు సమాచారం.
ALSO READ: నేటితో ముగియనున్న కవిత జ్యుడీషియల్ కస్టడీ..
కేంద్ర బడ్జెట్ తర్వాతే తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయని అధికారులు అంటున్నారు. రానున్న ఐదేళ్లకు సంబంధించి సంక్షేమ, అభివృద్ధి ప్రణాళికలు ఎలా ఉండాలన్న దానిపై కూడా మంత్రివర్గం సమావేశంలో చర్చించనున్నారు. వీటికితోటు మరికొన్ని అంశాలను ఈ సమావేశంలో చర్చించే అవకాశమున్నట్లు సమాచారం.