EPAPER
Kirrak Couples Episode 1

Revanth Reddy: ప్రపంచ దేశాలకు భారత రాజ్యాంగం ఆదర్శం: రేవంత్ రెడ్డి

Revanth Reddy: ప్రపంచ దేశాలకు భారత రాజ్యాంగం ఆదర్శం: రేవంత్ రెడ్డి
revanth reddy

Revanth Reddy: ప్రపంచ దేశాలకు భారత రాజ్యాంగం ఆదర్శంగా నిలిచిందని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో జరిగిన 74వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. జాతీయ జెండాను ఆవిష్కరించి.. జాతీయగీతాలాపన చేశారు. అనంతరం దేశ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.


బ్రిటిష్ పాలన నుంచి విముక్తి పొందిన తర్వాత దేశ ప్రజలకు పటిష్టమైన రాజ్యాంగాన్ని అందించాలని అంబేద్కర్, జవహార్‌లాల్ నెహ్రూ, రాజేంద్ర ప్రసాద్ వంటి మహనీయులు ముందుకొచ్చారని రేవంత్ రెడ్డి అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల హక్కులను కాలరాస్తూ పాలన సాగిస్తున్నాయని మండిపడ్డారు. ఉద్యమకారులు, నిరుద్యోగులు మళ్లీ ఉద్యమం చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు.

దేశానికి కాంగ్రెస్ పార్టీ చేసిన సేవలను ప్రజలు ఎప్పటికీ మరువలేరని తెలిపారు. బ్యాంకుల జాతీయకరణ చేసి ప్రజలకు అనేక సక్షేమ పథకాలు కాంగ్రెస్ అందించిందని వెల్లడించారు.


Related News

Hyderabad Real Boom: ఆ అందాల వలయంలో చిక్కుకుంటే మోసపోతారు.. హైదరాబాద్‌లో ఇల్లు కొనేముందు ఇవి తెలుసుకోండి

DSC Results 2024: డీఎస్సీ ఫలితాలను రిలీజ్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి.. కేవలం 56 రోజుల్లోనే!

 Rice Prices: సామాన్యులకు మరో షాక్.. భారీగా పెరగనున్న బియ్యం ధరలు!

Nepal Floods: నేపాల్‌లో వరదలు.. 150 మంది మృతి.. బీహార్‌కు హెచ్చరికలు

PM Modi: తెలంగాణపై ప్రశంసల వర్షం.. మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

Chicken Rates: మాంసం ప్రియులకు బ్యాడ్ న్యూస్.. భారీగా పెరిగిన చికెన్ ధరలు!

RTC Electric Buses: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి రానున్న 35 ఎలక్ట్రిక్ బస్సులు

Big Stories

×