Big Stories

Private Bus Accident in Hyderabad: నార్సింగ్ ఓఆర్ఆర్ వద్ద ప్రైవేటు బస్సు బోల్తా, ఒకరు మృతి..!

Private Bus overturns on ORR: హైదరాబాద్‌లో దారుణమైన యాక్సిడెంట్ జరిగింది. నార్సింగి వద్ద ఓఆర్ఆర్‌పై ప్రైవేటు బస్సు బోల్తాపడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. వెంటనే వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

- Advertisement -

హైదరాబాద్ నుంచి పుదుచ్చేరికి మార్నింగ్ స్టార్ ట్రావెల్స్‌కి చెందిన బస్సు ఆదివారం రాత్రి 9 గంటలకు గచ్చిబౌలిలో బయలుదేరింది. నార్సింగి నుంచి అలేఖ్య రైట్ టవర్స్ సమీపంలోని ఓఆర్ఆర్ మీదుగా వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బయలుదేరిన పావుగంటలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఘటన సమయంలో బస్సులో 18 మంది ప్రయాణికులు ఉన్నారు. ఆ ప్రాంతంలో ఆదివారం సాయంత్రం ఆరు గంటల సమయంలో వర్షం పడింది. రోడ్డు అంతా తడిగా ఉంది. అయినా బస్సు మాత్రం 150 కిలోమీటర్ల వేగంతో వెళ్తోందని స్థానికులు చెబుతున్నమాట.

- Advertisement -

బస్సు మలుపు తిరిగే క్రమంలో అదుపు తప్పి డివైడర్‌కు బలంగా ఢీ కొట్టి బోల్తా పడింది. ఈ ఘటనలో ఒంగోలుకు చెందిన మమత అనే మహిళ మృతి చెందింది. మిగతా ప్రయాణికులకు గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. బ్రీత్ ఎనలైజర్ తో పరీక్షించగా 197 వచ్చినట్టు తేలింది. డ్రైవర్ అతిగా మద్యం తీసుకోవడం వల్లే ఈ ఘటన జరిగిందని పోలీసులు భావిస్తున్నారు.

Also Read: చిరు- బండి సంజయ్ మధ్య చర్చ.. మీరొస్తే ప్రయార్టీ..

గాయపడిన ఇతర ప్రయాణికులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. రోడ్డుకు అడ్డంగా బస్సు బోల్తాపడడంతో కాసేపు ట్రాఫిక్ జామ్ అయ్యింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News