E-Paper
Advertisement

Ponguleti: అందుకే కాంగ్రెస్‌లోకి!.. పొంగులేటి క్లారిటీ!!

Ponguleti: అందుకే కాంగ్రెస్‌లోకి!.. పొంగులేటి క్లారిటీ!!
Advertisement
ponguleti congress

Ponguleti joining congress(Political news today telangana) : అన్నిపార్టీలు రారమ్మని పిలిచాయి. బీజేపీ అయితే కాళ్లబేరానికి వచ్చింది. ఏది కావాలో చెప్పు.. అంతకుమించే ఇస్తామని ఆఫర్లు ఇచ్చింది. అయినా.. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిలా కాషాయ గాలానికి చిక్కలేదు పొంగులేటి. స్వతహాగా బడా వ్యాపారవేత్త. అయినా బెదరలేదు. ఆశపడలేదు.

కేసీఆర్‌ను దెబ్బ కొట్టడమే ఆయన ఏకైక లక్ష్యం. అది ఎవరి వల్ల అయితే వారితోనే. సొంతంగా పార్టీ పెట్టాలని కూడా ఆలోచించారు. తెలంగాణ రైతు సమితి-TRS లాంటి కొన్నిపేర్లు కూడా పరిశీలించారు. దండిగా ఆర్థిక, అంగ బలం ఉన్న నేత. పార్టీ పెట్టడం చిటికెలో పని ఆయనకు. అయినా, కొత్త పార్టీ పెట్టలేదు. చివరాఖరికి కాంగ్రెస్‌లోనే చేరారు.

Advertisement

తన స్థాయిని ఘనంగా చాటేలా.. ఢిల్లి వెళ్లి మరీ రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలతో చర్చించారు. ఆ తర్వాత ప్రియాంక గాంధీని కూడా కలిశారు. కాంగ్రెస్‌ కండువా కప్పుకోకముందే తన ఉనికిని బలంగా చాటారు. జులై 2న ఖమ్మంలో భారీ బహిరంగ సభతో అట్టహాసంగా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి.

ఇంతకీ పొంగులేటి కాంగ్రెస్‌లోనే ఎందుకు చేరినట్టు? ఇదే విషయాన్ని ఢిల్లీ ప్రెస్‌మీట్‌లో వివరించి చెప్పారాయన. తెలంగాణ మేథావులు, ఉద్యమకారులు, ప్రజానీకంతో విస్తృత చర్చలు జరిపానని చెప్పారు. సొంతంగా ప్రముఖ సంస్థలతో సర్వేలు కూడా చేయించానని అన్నారు. అన్నిచర్చలు, అన్నిసర్వేలు కాంగ్రెస్‌ అయితేనే బెటర్ అని తేల్చాయి. రాహుల్ గాంధీ చేసిన భారత్ జోడో యాత్రతో పార్టీ అత్యంత బలంగా మారింది. కర్నాటక ఫలితాలు.. తెలంగాణలోనూ ప్రభావం చూపుతున్నాయని చెప్పారు.

Advertisement

కొత్త పార్టీ పెడితే.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి అది మళ్లీ కేసీఆర్‌కే అనుకూలంగా మారుతుందని.. అందుకే కొత్త పార్టీ ఆలోచన విరమించుకున్నానన్నారు పొంగులేటి. ఇక, బీజేపీలో లుకలుకలతో ఆ పార్టీ గ్రాఫ్ రోజురోజుకూ దారుణంగా పడిపోతోందని చెప్పారు. అధికారం, డబ్బులు, పదవుల కోసమైతే తాను బీజేపీలోకే వెళ్లే వాడినని అన్నారు. తన కుటుంబానికి వ్యాపారాలున్నా.. తాను కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలో కాకుండా.. గెలిచే అవకాశం ఉన్న కాంగ్రెస్‌లోనే చేరానని.. పొంగులేటి వివరించారు.

ఈసారి తెలంగాణలో కాంగ్రెస్‌ను గెలిపించాల్సిందేనని.. లేదంటే మనల్ని దేవుడు కూడా క్షమించడని మరో సీనియర్ నేత జూపల్లి కృష్ణారావు పిలుపిచ్చారు.

Related News

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ ఆరోగ్యం మాటేంటి? షాకింగ్ విషయాలు, బిగ్ టీవీతో డాక్టర్ రవిశంకర్

హైదరాబాద్‌ వాసులకు అదిరిపోయే వార్త.. ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తులు ప్రారంభం.. పూర్తి వివరాలు ఇవే!

మీర్‌పేట్‌లో అర్ధరాత్రి దారుణం.. బర్త్‌డే వేడుకలకు పిలిచి రౌడీషీటర్ దారుణ హత్య

GHMC ఎన్నికలపై హైకోర్టు సంచలన తీర్పు.. నోటిఫికేషన్‌కు తాత్కాలిక బ్రేక్!

తెలంగాణలో కొత్త ఎయిర్‌పోర్టులపై కీలక ప్రకటన.. వరంగల్ ఎయిర్‌పోర్టు నిధులు, టెండర్లు ఆహ్వానంపై

హైదరాబాద్ సిటీలో వాహనదారులకు బిగ్ అలర్ట్.. రెండు రోజులు ట్రాఫిక్ ఆంక్షలు, ఆయా ప్రాంతాల్లో

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

Big Stories

Advertisement
×