PM Modi Speech: ప్రధాని మోదీ కుటుంబ పాలన, అవినీతి పాలనపై నిప్పులు చెరిగారు. ఎక్కడా సీఎం కేసీఆర్ పేరు ఎత్తకుండా.. పరోక్షంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. కొందరి గుప్పిట్లోనే అధికారం మగ్గుతోందన్నారు. ప్రతీ ప్రాజెక్ట్, ప్రతీ పెట్టుబడిలో తనకేంటి లాభం అని కొందరు చూసుకుంటున్నారని విమర్శించారు. అలాంటి, అవినీతిపరులపై చర్యలు తప్పవని మోదీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అవినీతిపై చర్యల నుంచి తప్పించుకునేందుకు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని పరోక్షంగా ఎమ్మెల్సీ కవిత టాపిక్ను ప్రస్తావించారు.
అభివృద్ధిలో కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం కలిసిరావడం లేదని ప్రధాని మోదీ తప్పుబట్టారు. నిజాయితీగా పని చేయడం కొందరికి నచ్చడం లేదన్నారు ప్రధాని మోదీ. తనపై పోరాటానికి అన్ని శక్తులు ఏకమయ్యాయని.. అవినీతిపై పోరాటానికి తనకు ప్రజల మద్దతు కావాలన్నారు మోదీ.