Raghunandan Rao: దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావును పోలీసులు అరెస్ట్ చేయడం తెలంగాణలో పొలిటికల్ హీట్ పెంచింది. ఎమ్మెల్యే సిద్ధిపేట జిల్లాకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా హకీంపేట వద్ద రఘునందన్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి అల్వాల్ పోలీస్ స్టేషన్కు ఆయనను తరలించారు.
ఇటీవల గజ్వేల్లో శివాజీ విగ్రహం దగ్గర ఘర్షణలు జరిగాయి. ఈ ఘటనలో బాధిత హిందూ యువకులను పరామర్శించడానికి వెళ్లాలని రఘునందన్ రావు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో అక్కడకి వెళుతుండగా పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు.
రఘునందన్ రావు అరెస్ట్ పై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. బీజేపీ చేరికల కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ ఫోన్లో రఘునందన్ రావుతో మాట్లాడారు. తమ పార్టీ నేతలను అక్రమంగా నిర్భంధిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం చర్యలను తీవ్రంగా తప్పుబట్టారు.