Hyderabad student death news(TS news updates): హైదరాబాద్లో ఓ విద్యార్దిని అనుమానాస్పద మృతి కలకలం రేపింది. భరత్నగర్ బస్తీలో నవ్య అనే ఇంటర్ సెకండియర్ విద్యార్థిని సూసైడ్ చేసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 430 మార్కులతో డా.అంబేద్కర్ జూనియర్ కాలేజీలో టాపర్గా నిలిచింది. ఎప్పుడు చురుకుగా, చలాకిగా ఉండే నవ్య.. ఆత్మహత్య చేసుకోవడంపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
నవ్య తల్లిదండ్రులు మాత్రం.. తమ బిడ్డపై క్షుద్రపూజలు చేసి చంపారని ఆరోపిస్తున్నారు. ఇంటి ముందు క్షుద్రపూజలు చేసిన ఆనవాళ్లు ఉన్నాయని చెబుతున్నారు. గత నాలుగు రోజులుగా తమ ఇంటి ముందు నల్లబొమ్మ, నిమ్మకాయలు, పసుపు, కుంకుమ, కొబ్బరికాయలు పెట్టి వెళ్తున్నారని నవ్య కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
చనిపోయిన రోజు కూడా నవ్య అందరితో కలివిడిగానే ఉందని.. ఎలాంటి ఆరోగ్య సమస్యలు కూడా లేవని చెబుతున్నారు పేరెంట్స్. ఎప్పుడూ చురుకుగా ఉండే నవ్య ఇలా సడెన్గా సూసైడ్ చేసుకోవడంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మంత్రాలు చేసే ఆత్మహత్య చేసుకునేలా చేశారని ఆరోపిస్తున్నారు.
అయితే, క్షుద్రపూజల భయంతో నవ్య మానసికంగా కృంగి పోయిందని.. ఆ వ్యథతోనే ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని భావిస్తున్నారు. ఇంటి ముందు క్షుద్రపూజలు చేసింది ఎవరని ఆరా తీస్తున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.