Big Stories

Minister Ponnam tribute to Pv Narasimharao: దేశానికి పేరు తెచ్చిన వ్యక్తి పీవీ, ఆయన బాటలో: మంత్రి పొన్నం

Minister Ponnam tribute to Pv Narasimharao: ఆర్థిక భాషా కోవిదుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు దేశానికి ఎంతో పేరు తెచ్చారన్నారు బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. ఆయన తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణల పుణ్యమాని భారత‌దేశం ప్రపంచంలో ఆర్థికశక్తిగా ఎదుగుతుందన్నారు. బహుముఖ ప్రజ్ఞశాలి, అపార మేధావి మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు 103వ జయంతి నేడు. దేశ ప్రధానిగా ఆయన సేవలను గుర్తుకు తెచ్చుకున్నారు.

- Advertisement -

ఉమ్మడి కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో భారతరత్న పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి నివాళులు అర్పించారు మంత్రి పొన్నం. ఆయనతోపాటు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ప్రధాని పీవీ మధుర స్మృతులను గుర్తు చేసుకున్నారు.

- Advertisement -

తెలంగాణ ముద్దు బిడ్డయిన పీవీ, వంగరలో జన్మించారు. ఆయన చూపిన మార్గదర్శకంలో తామంతా నడవాలని కోరుకుంటున్నామన్నారు మంత్రి. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తెచ్చిన వ్యక్తి మన పీవీ అని తెలిపారు. ముఖ్యంగా నవోదయ, కేంద్రీయ విద్యాలయాలను తీసుకొచ్చిన ఘనత ఆయనకే చెందుతుందన్నారు. పీవీ చూపిన మార్గదర్శకంలో తామంతా నడవాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు.

ALSO READ:  మాజీ సీఎం కేసీఆర్ పిటిషన్‌పై హైకోర్టులో ముగిసిన వాదనలు..తీర్పు రిజర్వ్

విప్లవాత్మక సంస్కరణలు, సాహసోపేత నిర్ణయాలతో దేశం బలమైన ఆర్థికశక్తిగా ఎదిగేందుకు పునాదులు వేశారన్నారు. రాష్ట్రానికే కాకుండా దేశానికీ ఆయన చేసిన సేవలు మరువలేమన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News