Big Stories

Medak road accident: మెదక్‌లో ఘోరమైర యాక్సిడెంట్‌లో నలుగురు మృతి

Medak road accident: అతివేగం ప్రమాదకరం.. పోలీసులు నిత్యం చెబుతూనే ఉంటారు. అయినా యాక్సిడెంట్లు చోటు చేసుకుంటున్నాయి. ఈ మధ్య ట్రాఫిక్ సిగ్నల్ వద్ద మైకులతో అనౌన్స్‌మెంట్లు చేస్తున్నారు. అయినా వాహనదారులు ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. తాజాగా మెదక్ జిల్లా చేగుంట మండలం వడియారం బైపాస్ వద్ద రోడ్డు లారీలు ఢీ కొన్నాయి

- Advertisement -

ఈ ఘటనలో స్పాట్‌లో నలుగురు మృతి చెందారు. ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి వస్తున్న మరో లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో వెనుక లారీలో క్యాబిన్‌లో ఉన్న నలుగురు మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

- Advertisement -

గాయపడినవారిని వెంటనే సమీపంలో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితులు కోలుకుంటున్నారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. రోడ్డుపై ఉన్న లారీలను పక్కకు పెట్టి ట్రాఫిక్‌కు ఎలాంటి అంతరాయం లేకుండా చూశారు. ప్రమాదం జరిగిన తీరుకు పరిశీలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.

 

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News