Car Accident: పుట్పాత్లు ఎందుకు? నడవడానికి కాదా? అంటే అవును అనే అంటున్నారు బండ్లగూడ మేయర్. ఇవాళ ఉదయం అతివేగంతో వచ్చిన కారు… పుట్పాత్పై నడుస్తున్న ముగ్గురిపై దూసుకెళ్లింది. ఈప్రమాదంలో వారు అక్కడిక్కడే మృతి చెందారు. అయితే బండ్లగూడ మేయర్ చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి.
ప్రమాదం జరిగిన ప్రాతంంలో ఎలాంటి స్పీడ్ లిమిట్ బోర్డు లేవు. రవాణాశాఖ ఉత్తర్వుల ప్రకారం డివైడర్లు ఉన్న మార్గాల్లో కార్లు గరిష్టంగా గంటకు 60 కిలోమీటర్లు, మిగిలిన వాహనాలు 50 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్లాలి. దీనికి సంబంధించి బోర్డులు ఏర్పాటు చేయాలి. కాని బండ్లగూడలో జరిగిన యాక్సిడెంట్ స్పాట్లో ఎలాంటి స్పీడ్ బోర్డులు లేవు.
ప్రమాదాలను కంట్రోల్ చేయాల్సిన వాళ్లే.. పుట్పాత్లపై నడవొద్దు అంటూ.. చెప్పడం విడ్డూరంగా ఉంది. చాలా మంది కార్లను ఓవర్ స్పీడ్తో నడుపుతున్నారు. వీరి అతివేగం జనాల ప్రాణాలు తీస్తున్నాయి. ప్రమాదాలు జరిగినప్పుడు కూడా ఓవర్ స్పీడ్ ఘటనలపై పట్టించుకునే నాథుడు లేడు.