Big Stories

Malla Reddy Hostel Food: మల్లారెడ్డి కాలేజీ హాస్టల్‌లో స్టూడెంట్స్ రోడ్లపై ఆందోళన.. ఇదేం ఫుడ్ అంటూ నిరసన!

Malla Reddy Hostel Food: మల్లారెడ్డి యూనివర్సిటీ ఏదో విధంగా వార్తల్లోకి వస్తోంది. దీనికితోడు యాజమాన్యం తీరు నిత్యం వివాదాస్పదంగా మారుతోంది. తాజాగా మరోసారి ఆహారంలో పురుగులు వచ్చాయంటూ విద్యార్థుల ఆందోళనకు దిగారు.

- Advertisement -

యూనివర్సిటీ ముందు బైఠాయించి మల్లారెడ్డి డౌన్ డౌన్ అంటూ విద్యార్థులతో కలిసి స్టూడెంట్స్ నాయకులు ధర్నా చేశారు. లక్షల్లో ఫీజులు కట్టించుకొని పురుగుల ఆహారాన్ని పెడుతూ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.

- Advertisement -

మైసమ్మగూడలోని మల్లారెడ్డి కళాశాల యాజమాన్యం తీరుపై స్టూడెంట్స్ మండిపడుతున్నారు. విద్యార్థు లకు పెడుతున్న ఆహారంలో బొద్దింకలు పడుతున్నా యాజమాన్యం సైలెంట్‌గా ఉండటాన్ని తప్పుబడు తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో కూడా విద్యార్థులు ఫుడ్ విషయంలో ఆందోళన చేశారు. యాజమాన్యం పట్టించుకున్న సందర్భం లేదు.

Also Read: తెలంగాణ కోటా ఎంత? కేంద్ర మంత్రి పదవులు దక్కేదెవరికి?

హాస్టల్ ఇన్‌ఛార్జ్‌ని నిలదీశారు విద్యార్థులు. అంతకుముందు మల్లారెడ్డి కాలేజీ హాస్టల్‌ గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఓ విద్యార్థిని సూసైడ్ చేసుకున్న విషయం తెల్సిందే. ఫుడ్ విషయంలో యాజమాన్యం సరైన చర్యలు తీసుకోకుంటే రానున్న రోజుల్లో ఆందోళనను తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News