Uppal Skywalk inauguration(Hyderabad News Today): హైదరాబాద్ మరో స్కైవాక్ అందుబాటులోకి వచ్చింది. ఉప్పల్ జంక్షన్ లో నిర్మించిన స్కైవాక్ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. రోడ్డు దాటే పాదచారుల కోసం హెచ్ఎండీఏ ఈ స్కైవాక్ ను నిర్మించింది. 660 మీటర్ల పొడువున దీన్ని ఏర్పాటు చేశారు. ఇందుకోసం మొత్తం రూ.25 కోట్లు ఖర్చు చేశారు.
4 వైపుల నుంచి నేరుగా ఉప్పల్, సికింద్రాబాద్, ఎల్బీనగర్, రామంతాపూర్ రహదారులు, మెట్రో స్టేషన్కు స్కైవాక్ ను అనుసంధానించారు. మెట్లు ఎక్కలేని వారికోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎస్కలేటర్లు, లిఫ్టులు కూడా అందుబాటులో ఉన్నాయి. సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. నిరంతరం పర్యవేక్షించేందుకు ప్రత్యేక వ్యవస్థ ఉంటుంది. పాదచారుల కోసం టాయిలెట్ల సౌకర్యం కల్పించారు. నడిచివెళ్లేవారికి రక్షణ కోసం సైవాక్ కు ఇరువైపులా రెయిలింగ్ ఏర్పాటు చేశారు. ఎల్ఈడీ దీపాలు అర్చారు. ఎండ తగలకుండా రూఫ్లను ఏర్పాటు చేశారు.
ఉప్పల్ మెట్రో స్టేషన్ నుంచి నిత్యం 25-30 వేల మంది ప్రయాణిస్తారు. రింగురోడ్డులో రాకపోకలు సాగించే పాదచారుల సంఖ్య సుమారు 20 వేల వరకు ఉంటుంది. పాదచారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్కు అంతరాయం లేకుండా ఉండటం కోసం స్కైవాక్ ను ఏర్పాటు చేశారు.