Hijab news in Telugu(Telangana today news) : హైదరాబాద్ లో మరోసారి హిజాబ్ వివాదం తలెత్తింది. హయత్ నగర్లోని జీ హైస్కూల్లో గొడవ చోటు చేసుకుంది. పదో తరగతి చదువుతున్న విద్యార్థిని ముఖానికి స్కార్ఫ్తో రావడంతో స్కూల్ యాజమాన్యం.. తనని ఇంటికి పంపించింది. దీనిపై సదరు విద్యార్థిని తల్లిదండ్రులు పోలీసులకు కంప్లైంట్ చేయగా కేసు నమోదు చేశారు. విద్యార్థిని స్టేట్ మెంట్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. బాధిత విద్యార్థిని నగరంలోని ఓ ప్రముఖ న్యాయమూర్తి కూతురని తెలుస్తోంది.