Kalvakuntla Kavitha Turn as Approver in Delhi Liquor Scam Case: దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత అరెస్ట్ అయిన సంగతి అందరికి తెలిసిందే.. అయితే ఇటీవల జ్యుడీషియల్ కస్టడీని జులై 7 వరకు పొడిగిస్తూ రౌస్ రెవెన్యూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత అప్రూవర్గా మారే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే ఆమె జైల్లో ఉండి వందరోజులు దాటింది. జైల్లో మగ్గిపోవాల్సి రావడంతో కవిత ఉక్కిరిబిక్కిరవుతున్నట్టు తెలుస్తోంది. కుటుంబ సభ్యుల తీరుపైనా ఆమె ఆగ్రహంతో ఉన్నారట. తన పిల్లలకు దూరంగా ఉండాల్సి రావడం, పైగా ఎవరూ పట్టించుకోవడం లేదన్న బాధలో కవిత ఉన్నట్టు తెలుస్తోంది. తన తండ్రి కేసీఆర్ కూడా ఇప్పటివరకు కవితను పరామర్శించలేదు.
Also Read: వరంగల్ అభివృద్ధిపై సీఎం రేవంత్ స్పెషల్ ఫోకస్..ప్రత్యేక జోన్గా టెక్స్ టైల్ పార్కు
దీంతో ఆమె మరింత మానసికంగా ఆందోళనకు గురి అవుతున్నట్టు తెలుస్తోంది. కేటీఆర్.. తీహార్కు రెండు సార్లు వెళ్లి కలిశారు. రీసెంట్ గా హరీశ్ రావు కవితను జైల్లో కలిసి నచ్చజెప్పారు. ఇప్పట్లో బెయిల్ రావడం డౌటే అని లీగల్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. అప్రూవర్గా మారితే వెంటనే బెయిల్ రావొచ్చన్న వాదన వినిపిస్తోంది. దాంతో బెయిల్ కోసం కవిత అప్రూవర్గా మారొచ్చని సన్నిహితులు చెబుతున్నారు.