IPS Transfers in Telangana: తెలంగాణలో బదిలీల పర్వం కొనసాగుతుంది. ఇప్పటికే పలువురు ఐపీఎస్, ఐఏఎస్ అధికారులను బదిలీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా 8 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. భద్రాచలం ఏఎస్పీగా విధులు నిర్వర్తిస్తోన్న పరితోష్ పంకజ్ను కొత్తగూడెం ఓఎస్డీగా బదిలీ చేశారు.
ఏడీసీ గవర్నర్గా విధులు నిర్వర్తిస్తోన్న సిరిసెట్టి సంకీర్త్ ఏఎస్పీ ర్యాంకు హోదాలో ఏడీసీ గవర్నర్గానే ఉండనున్నారు. ఏటూరునాగారం ఏఎస్పీగా విధులు నిర్వర్తిస్తోన్న మహేశ్ బాబాసాహెబ్ను ములుగు ఓఎస్డీగా బదిలీ చేశారు. భైంసా ఏఎస్పీగా ఉన్న పాటిల్ కాంతీలాల్ సుభాశ్ను సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీగా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Also Read: తెలంగాణలో భారీగా ఐపీఎస్ల బదిలీ..
జనగాం ఏఎస్పీగా విధులు నిర్వర్తిస్తోన్న అంకిత్ కుమార్ శంఖావర్ను భద్రాచలం ఏఎస్పీగా బదిలీ చేశారు. అసాల్ట్ కమాండర్ గ్రేహౌండ్స్గా ఉన్న అవినాష్ కుమార్ భైంసా ఏఎస్పీగా బదిలీ అయ్యారు. ఇక వేములవాడ ఏఎస్పీగా అసాల్ట్ కమాండర్ గ్రేహౌండ్స్ శేషాద్రిని రెడ్డి బదిలీ అయ్యారు. ఏటూరునాగారం ఏఎస్పీగా అసాల్ట్ కమాండర్ గ్రేహౌండ్స్ శివమ్ ఉపాధ్యాయను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం.