EPAPER

Telangana : ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు.. ఎంతంటే..?

Telangana :  ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు.. ఎంతంటే..?


TS Govt employees news(Latest news in Telangana): తెలంగాణ రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాల వేళ ప్రభుత్వ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పంది. డీఏ, పింఛనుదారులకు డీఆర్‌ 2.73 శాతం పెంచింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాలతో ఉత్తర్వులు ఇచ్చామని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు.

2022 జనవరి నుంచి డీఏ పెంపు వర్తిస్తుంది. సర్కార్ నిర్ణయంతో 7.28 లక్షల మంది ఉద్యోగులు, పింఛనుదారులకు లబ్ధి చేకూరుతుంది. డీఏ, డీఆర్ పెంపు వల్ల ప్రభుత్వంపై నెలకు రూ.81.18 కోట్ల భారం పడుతుంది. అంటే ఏడాదికి రూ.974.16 కోట్ల భారం పడుతుందని మంత్రి హరీష్ రావు వెల్లడించారు. పెంచిన డీఏ ప్రకారం ఉద్యోగులు, పింఛనుదారులకు 2022 జనవరి 1 నుంచి 2023 మే 31 వరకు రూ.1,380.09 కోట్ల బకాయిలను చెల్లిస్తారు.


డీఏ పెంపుపై ఉద్యోగ సంఘాలు సంతోషం వ్యక్తం చేశాయి. టీఎన్జీవో, టీజీవో, పీఆర్‌టీయూటీఎస్‌, ట్రెసా, పెన్షనర్ల జేఏసీ, తెలంగాణ ఉద్యోగుల సంఘం నేతలు హర్షం ప్రకటించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు చెప్పారు.

Related News

Trinayani Serial Today September 21st: ‘త్రినయని’ సీరియల్‌: డీల్ కోసం ఇంటికి వచ్చిన గజగండ – గజగండను చంపే ప్రయత్నం చేసిన గాయత్రిదేవి, నయని

Nindu Noorella Saavasam Serial Today September 21st: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆరు ఆత్మను చూసిన మనోహరి – అంజును చూసి ఎమోషన్ అయిన ఆరు

Kalinga Movie: నన్ను పద్దు పద్దు అని పిలుస్తుంటే హ్యాపీగా ఉంది: ‘కళింగ’ మూవీ హీరోయిన్ ప్రగ్యా నయన్

Honeymoon Express: ఓటీటీలోనూ రికార్డులు బ్రేక్ చేస్తున్న ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’

Best Electric Cars: తక్కువ ధర, అదిరిపోయే రేంజ్- భారత్ లో బెస్ట్ అండ్ చీప్ 7 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Pod Taxi Service: భలే, ఇండియాలో పాడ్ ట్యాక్సీ పరుగులు.. ముందు ఆ నగరాల్లోనే, దీని ప్రత్యేకతలు ఇవే!

Sitaram Yechury: మరింత విషమంగా సీతారాం ఏచూరి ఆరోగ్యం

Big Stories

×