Crime News(Telangana Latest Updates): కన్న కూతుర్ని గొడ్డలితో నరికి చంపాడో కసాయి తండ్రి. పెద్దపల్లి జిల్లా మంథనిలో జరిగిందీ దారుణ ఘటన. కూతుర్ని చంపిన తర్వాత కూడా ఓ స్థానికుడిపై దాడి చేశాడు. గతంలో తన భార్యను ఉరేసి చంపిన కేసులో అతను జైలుకు కూడా వెళ్లొచ్చాడు. ఇప్పుడు కూతుర్ని కూడా బలి తీసుకున్నాడు.
నిందితుడు సదయ్యకు మానసిక స్థితి సరిగా లేదని కొందరు కాలనీవాసులు చెప్తున్నారు. నిందితుడు సదయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వెహికల్లో పోలీస్ స్టేషన్కు తరలిస్తుండగా స్థానికులు అడ్డుపడ్డారు. అతన్ని మాకు అప్పగించండి.. మేమే శిక్షిస్తాం అంటూ పట్టుబట్టారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
నిందితుడిని బలవంతంగా తరలించబోతుండగా.. పోలీసుల వాహనంపై మూకుమ్మడిగా దాడి చేశారు గ్రామస్తులు. సదయ్యను కొట్టి చంపాలని వారంతా డిసైడ్ అయ్యారు. అందుకు పోలీసులు అడ్డుపడుతుండటంతో.. ఖాకీల కళ్లల్లో కారం చల్లారు కొందరు ఆందోళనకారులు. దీంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది.