Big Stories

CM Revanth Reddy Visits MCHRD : ఎంసీహెచ్‌ఆర్డీకి సీఎం రేవంత్ రెడ్డి.. క్యాంప్ కార్యాలయం ఏర్పాటు చేసే ఛాన్స్..

CM Revanth Reddy Visits MCHRD : మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రానికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారు. ఎంసీహెచ్‌ఆర్డీ అధికారులతో సమావేశమయ్యారు. కేసీఆర్‌ను పరామర్శించిన తర్వాత నేరుగా ఎంసీహెచ్‌ఆర్డీకి సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నారు.

- Advertisement -

సీఎం అయిన తర్వాత రేవంత్ రెడ్డి మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రాన్ని సందర్శించడం ఇదే మొదటిసారి. సీఎం రేవంత్ రెడ్డితో పాటు పంచాయితీరాజ్ శాఖా మంత్రి సీతక్క, షబ్బీర్ అలీ ఉన్నారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో సీఎం క్యాంప్ కార్యాలయం ఏర్పాటు చేసే ఆలోచనలో ముఖ్యమంత్రి ఉన్నట్లు తెలుస్తుంది.

- Advertisement -

సీఎం హోదాలో రేవంత్ రెడ్డి దూసుకుపోతున్నారు. ప్రమాణస్వీకారం జరగకముందే ప్రగతి భవన్ ముందున్న కంచె తీసేసి తమది ప్రజా ప్రభుత్వం అని తేల్చిచెప్పారు. ప్రగతి భవన్ ను ప్రజాభవన్ గా పేరు మార్చి సామాన్య ప్రజల సమస్యలను తెల్సుకోవడానికి ప్రజా దర్బార్ పెట్టారు. ఈ కార్యక్రమానికి ఊహించని విధంగా స్పందన వచ్చింది. ఇవ్వాళ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ సీఎం కేసీఆర్ ను పరామర్శించడం ద్వారా రాజకీయాలలో శాశ్వత శత్రువులు ఉండరని మరోసారి నిరూపించారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News