Big Stories

CM Revanth Reddy: గవర్నర్ రాధాకృష్ణన్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. కీలక అంశాలపై చర్చ

CM Revanth Reddy to meet Governor: సీఎం రేవంత్ రెడ్డి రాజ్ భవన్‌లో గవర్నర్ రాధాకృష్ణన్‌తో భేటీ అయ్యారు. ప్రభుత్వం ఇటీవల కొన్ని బిల్లులను రూపొందించింది. ఈ మేరకు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న వివిధ బిల్లులపై గవర్నర్‌తో సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. ప్రధానంగా అసెంబ్లీ సమావేశాలు, నామినేటెడ్ ఎమ్మెల్సీల అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది.

- Advertisement -

అలాగే బిల్లులు, మంత్రివర్గ విస్తరణపై ప్రత్యేకంగా డిస్కస్ చేయనున్నారు. ఈ అంశాలను చర్చించిన తర్వాత వీటిని ఆర్డినెన్స్ రూపంలో వెంటనే అమల్లోకి తెచ్చే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, గవర్నర్‌తో కలిసి సీఎం రేవంత్ రెడ్డి భోజనం చేశారు. సీఎం వెంట ఆయన సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి ఉన్నారు.

- Advertisement -

అంతకుముందు, సీఎం రేవంత్ రెడ్డిని కలిసేందుకు మహబూబాబాద్ జిల్లాలోని నారాయణపురం నుంచి కొంతమంది రైతులు సచివాలయానికి వచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణిలో రైతుల పేర్ల విషయంలో చాలా అవకతవకలు జరిగాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో రెవెన్యూ అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ ఆరోపించారు. అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డిని కలిసి రైతులు సమస్యను వివరించారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News