Big Stories

CM Revanth Reddy: తెలంగాణకు ప్రత్యేక గౌరవం.. యువకవికి సీఎం రేవంత్ అభినందనలు

CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్రానికి చెందిన యువ రచయితకు కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం 2024 వరించింది. నిజామాబాద్ జిల్లాకు చెందిన 26 ఏళ్ల గిరిజన బిడ్డ రమేశ్ నాయక్‌కు ఈ పురస్కారం అందించినట్లు సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా ప్రత్యేక ట్వీట్ చేశారు. ఈఏడాది వివిధ భాషల్లో అత్యుత్తమ రచనలు చేసిన రచయితలకు యువ, బాల సాహిత్య పురస్కారాలను ప్రకటించిన విషయం తెలిసిందే.

- Advertisement -

గొప్ప వరం
చిన్న వయస్సులో ధావ్లో రచనకు పురస్కారం రావడంతో రమేష్‌కు సీఎం అభినందనలు తెలిపారు. ఈ అవార్డు గిరిజనుల సంస్క‌తి, సంప్రదాయాలకు మాత్రమే కాదు.. తెలంగాణ రాష్ట్రానికి గొప్ప వరమన్నారు. రమేష్.. భవిష్యత్తులో మరిన్ని రచనలు చేసి సాహిత్య రంగంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని సీఎం ఆకాంక్షించారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News