KCR news today live(Telangana formation day 2023): సంక్షేమంలో రాష్ట్రం స్వర్ణ యుగాన్ని ఆవిష్కరించిందన్నారు కేసీఆర్. సంపద పెంచుదాం, ప్రజలకు పంచుదాం అనేదే తమ నినాదమని చెప్పారు. నిన్నటి ఉద్యమ తెలంగాణ.. నేడు ఉజ్వల తెలంగాణ.. అంటూ కీర్తించారు. దశాబ్ది వేడుకల వేళ.. పోడు భూములకు పట్టాలు ఇస్తామని.. పోడు భూములకూ రైతుబంధు పథకం అమలు చేస్తామని ప్రకటించారు.
దేశంలోనే బలీయమైన శక్తిగా తెలంగాణ ఎదిగిందన్నారు సీఎం కేసీఆర్. ప్రతి రంగంలోనూ తెలంగాణ ప్రగతిపథంలో పరుగులు పెడుతోందని.. రాష్ట్ర పథకాల పట్ల దేశమంతటా ఆదరణ కనిపిస్తోందని చెప్పారు. రాష్ట్ర పథకాల పట్ల దేశమంతటా ఆదరణ కనిపిస్తోందని తెలిపారు. అమరుల ఆశయాలు, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు తమ ప్రభుత్వం మనసా, వాచా, కర్మణా అంకితమైందన్నారు కేసీఆర్.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా.. సచివాలయంలో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్నారు సీఎం కేసీఆర్. జాతీయ జెండా ఎగురవేసి.. భద్రతా బలగాల గౌరవ వందనం స్వీకరించారు. అంతకుముందు గన్పార్క్ దగ్గర అమరవీరులకు నివాళులర్పించారు. 21 రోజుల జరిగే వేడుకల్లో ప్రజలంతా ఉత్సాహంగా పాల్గొనాలని పిలుపు ఇచ్చారు.