KTR Condolence to MLA medipally Sathyam Family: చొప్పదండి కాంగ్రెస్ ఎమ్మెల్యేను మేడిపల్లి సత్యంను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు(కేటీఆర్) పరామర్శించారు. ఆయన సతీమణి మరణంతో విషాదంలో ఉన్న సత్యం కుటుంబాన్ని కేటీఆర్ పరామర్శించి ఓదార్చారు. బుధవారం అల్వాల్ లోని ఎమ్మెల్యే నివాసానికి చేరుకుని రూపాదేవి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కేటీఆర్ వెంట బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వివేక్, పాడి కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్సీ శంభిపూర్ రాజు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తోపాటు పార్టీకి చెందిన సీనియర్ నాయకులు ఉన్నారు.
Also Read: బ్రేకింగ్ న్యూస్.. అలక వీడిన జీవన్ రెడ్డి.. పార్టీనే ముఖ్యమంటూ వ్యాఖ్య
కాగా, ఎమ్మెల్యే సత్యం సతీమణి రూపాదేవి వారం రోజుల క్రితం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషయం విధితమే. ఆమెకు గైనిక్ సమస్యలు ఉన్నాయని, కడుపునొప్పి తట్టుకోలేకే బలవన్మరణానికి పాల్పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే, సత్యం – రూపాదేవిలది ప్రేమ వివాహం. బీఈడీ పూర్తి చేసిన రూపాదేవి.. ప్రభుత్వ టీచర్ గా ఉద్యోగం సాధించారు.