IIIT basar student death(Telangana today news): బాసర ట్రిపుల్ ఐటీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. మరో విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. హాస్టల్ భవనం నుంచి దూకి లిఖిత అనే స్టూడెంట్ మృతి చెందింది. అర్థరాత్రి 2 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతి చెందిన లిఖిత గజ్వేల్ కు చెందిన యువతిగా గుర్తించారు.
రెండు రోజులక్రితం దీపిక అనే విద్యార్ధిని సూసైడ్ చేసుకుంది. ఇంతలోనే మరో విద్యార్ధిని ప్రాణం తీసుకోవడం క్యాంపస్ లో కలకలం రేపుతోంది. వరుస ఘటనలతో బాసర ట్రిపుల్ ఐటీపై విమర్శలు వస్తున్నాయి. అటు విద్యార్ధుల తల్లిదండ్రుల్లో కూడా కలవరం రేగుతోంది. ఆత్మహత్యలకు కారణాలేంటన్నది ఇంకా తేలాల్సి ఉంది.