Big Stories

T20 World Cup 2024 IND vs IRE: ఐర్లాండ్ తో మ్యాచ్ లో.. ఓపెనర్ ఎవరు? కీపర్ ఎవరు?

India vs Ireland Match Who is opener: టీ 20 ప్రపంచకప్‌లో భారత్ తొలిమ్యాచ్‌కు సిద్ధమైంది. ఐదున ఐర్లాండ్‌తో తలపడుతోంది. ఇప్పుడు నెట్టింట ఓ వైపు చర్చలు, మరోవైపు డిబేట్లు. వాదోపవాదాలు, ఛాలెంజ్‌లు, పరస్పర విమర్శలు.  అసలు విషయం ఏమిటంటే.. ఐర్లాండ్‌తో జరగనున్న మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్‌గా ఎవరు దిగుతున్నారు? వికెట్ కీపర్ ఎవరు? అన్నదానిపై చర్చ జోరుగా సాగుతోంది.

 

- Advertisement -

ఎందుకంటే వార్మప్ మ్యాచ్ లో ఓపెనర్ యశస్విని కాదని, సీనియర్ అయిన సంజూ శాంసన్ ని తీసుకొచ్చారు. కాకపోతే తను నిరాశపరిచాడు. అయినా సరే, విదేశీ పిచ్ లపై అంతగా అనుభవం లేని యశస్విని ఆడించేకన్నా,అనుభవజ్ణుడైన సంజూ శాంసన్ పై టీమ్ ఇండియా మేనేజ్మెంట్ మొగ్గు చూపించే అవకాశాలున్నాయి. అలా జరిగితే మరి కీపింగ్ ఎవరు చేస్తారు? అనేది పెద్ద పజిల్ గా మారింది.

- Advertisement -

కారణం ఏమిటంటే రిషబ్ పంత్ మొన్న మ్యాచ్ లో బ్రహ్మాండంగా ఆడి.. ఇండియాకి గౌరవ ప్రదమైన స్కోరు తీసుకొచ్చాడు. అందువల్ల పంత్ ని ఆడిస్తారు. అప్పుడు సంజూ శాంసన్ ఓపెనర్ గా వస్తే ఇద్దరు వికెట్ కీపర్లు ఉంటారు. అప్పుడు కీపింగ్ ఎవరు చేస్తారు? బ్యాటర్ గా ఎవరు వస్తారనేది ప్రశ్నగా ఉంది.

Also Read: సూపర్ ఓవర్లో నమీబియా విక్టరీ, ఇది మూడోసారి

ఒకవేళ వార్మప్ మ్యాచ్ లో సంజూ విఫలమయ్యాడు కాబట్టి, ఒకరే వికెట్ కీపర్ గా రిషబ్ పంత్ ని కొనసాగించి, సంజూ ప్లేస్ లో యశస్విని తీసుకొస్తారా? అనేది పెద్ద సమస్యగా ఉంది. ఏదేమైనా జట్టు కూర్పు అంతా టీమ్ మేనేజ్మెంట్ చేతిలో ఉంది. ఈ రెండు ప్లేస్ లు తప్ప.. 11 మంది జట్టులో మిగిలిన 9 మంది దాదాపు ఖరారైనట్టు చెబుతున్నారు. బహుశా జట్టు కూర్పు  ఇలా ఉండవచ్చునని అంటున్నారు.

రోహిత్ శర్మ, యశస్వి జైశ్వాల్ , సంజూ శాంసన్, విరాట్ కొహ్లీ, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబె / అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, కులదీప్  / చాహల్, బూమ్రా,  అర్షదీప్ సింగ్

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News