Big Stories

Singapore open 2024 sindhu won: సింగపూర్ ఓపెన్, సింధు శుభారంభం

Singapore open 2024 sindhu won(Sports news headlines): సింగపూర్ బ్యాడ్మింటన్ ఓపెన్‌లో భారత షట్లర్ పీవీ సింధు శుభారంభం చేసింది. మహిళల సింగల్స్ విభాగంలో పీవీ సింధు.. డెన్మార్క్ క్రీడాకారిణి లైన్ హోజ్‌మార్క్‌పై సునాయాశంగా విజయం సాధించింది.

- Advertisement -

బుధవారం మధ్యాహ్నం వీరిద్దరి మధ్య మ్యాచ్ మొదలైంది. తొలిసెట్‌లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది సింధు. సెకండ్ సెట్లో ప్రత్యర్థి హోజ్‌మార్క్‌ పుంజుకుంది. కానీ పీవీ సింధు అనుభవం ముందు ఆమె తలవంచింది.

- Advertisement -

ఫస్టాప్ దూకుడుగా ఆడిన సింధు, ఆ తర్వాత స్లో అయ్యింది. ఈలోగా ప్రత్యర్థి హోజ్‌మార్క్‌ పుంజుకోవడం తో ఆమె సర్వీస్‌ను డౌన్ చేసింది. చివరలో ఆమెకి ఏమాత్రం ఛాన్స్ ఇవ్వలేదు. దీంతో రెండు సెట్లను 21-12, 22-20 తేడాతో గెలిచి తదుపరి రౌండ్‌కు అర్హత సాధించింది పీవీ సింధు.

ALSO READ: ఆ రోజులు తలచుకుంటే.. ఇప్పటికీ భయమేస్తుంది : పంత్

పురుషుల సింగల్స్ విభాగంలో ఇండియా ఆటగాడు లక్ష్యసేన్‌కు చుక్కెదురైంది.  డెన్మార్క్ ప్లేయర్ ఆక్సెల్సెన్‌తో నువ్వానేనా అన్నరీతిలో పోరు సాగింది. తొలిసెట్ పొగొట్టుకున్న సేన్, రెండో సెట్‌లో మాత్రం ప్రత్యర్థికి ఏమాత్రం ఛాన్స్ ఇవ్వలేదు. ఆది నుంచి దూకుడుగా ఆడాడు. దీంతో మూడో సెట్ ఇరువురు ఆటగాళ్ల మధ్య పోరు ఉత్కంఠ భరితంగా సాగింది. ఫస్టాప్ ఆధిక్యంలోకి దూసుకెళ్లిన ఆక్సెల్సెన్, చివరి వరకు అదే కంటిన్యూ చేశాడు. దీంతో 21-13, 16-21, 21-13 తేడాతో ఓటమిపాలయ్యాడు.

 

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News