Can India go With only Three Specialist Batters in 2024 T20 WC Final against SA: టీమ్ ఇండియా ఫైనల్ వరకు వచ్చిందంటే, కొంచెం అదృష్టం కలిసి వచ్చిందనే చెప్పాలి. లేకపోతే టీ 20 ప్రపంచకప్ మొదలైన దగ్గర నుంచి ముగ్గురే స్పెషలిస్టు బ్యాటర్లు ఉన్నారు. వారితోనే ధైర్యంగా దిగి ఇంతవరకు వచ్చారు. ఇందులో కూడా కొహ్లీ పాత్ర లేదనే చెప్పాలి. అలా చూస్తే స్పెషలిస్టు బ్యాటర్లు ఇద్దరే ఉన్నట్టు అనుకోవాలి.
వీళ్లు ముగ్గురి తర్వాత రిషబ్ పంత్ ఆల్ రౌండర్.. తను మొదట నాలుగు మ్యాచ్ లు క్లిక్ అవడం భారత్ కి కలిసి వచ్చింది. తర్వాత హార్దిక్ పాండ్యా ఫామ్ లో ఉండటం వల్ల ఫినిషింగ్ బాగా కుదురుతోంది. ఇక శివమ్ దుబె కూడా ఆశించినంతగా ఆడటం లేదు. ఇంతవరకు తన స్కోరు చూస్తే.. 0, 28, 34, 10, 31*, 3, తాజాగా సెమీఫైనల్ లో గోల్డెన్ డక్ కూడా అయ్యాడు.
నిజానికి గ్రూప్ దశలో పాకిస్తాన్ తో ఓడిపోవాల్సిన మ్యాచ్ అది. అత్యంత ‘లో స్కోరు’ మ్యాచ్ ని బౌలర్లు గెలిపించారు. ముఖ్యంగా బుమ్రా అద్భుతంగా బౌలింగు చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. ఇప్పటికి 7 మ్యాచ్ లు జరిగితే ఎక్కువసార్లు బౌలర్లే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకోవడం విశేషం.
ఈసారి కూడా టీమ్ ఇండియా బౌలర్లపైనే భారమంతా పడుతోంది. మరి ఆడాల్సిన ఆఖరి ఫైనల్ మ్యాచ్ లో ఎలా ఆడతారో వేచి చూడాల్సిందే.