Big Stories

Afghanistan Won by 8 Runs on Bangladesh: బంగ్లాదేశ్‌పై అఫ్గాన్ సంచలన విజయం.. సెమీస్‌ చేరిన పసికూన.. ఆస్ట్రేలియా ఇంటికి..!

Afghanistan Won by 8 Runs on Bangladesh in T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్‌ టోర్నీమెంట్‌లో మరో సంచలనం నమోదైంది. అఫ్గనిస్తాన్ జట్టు తొలిసారి సెమీఫైనల్‌కు చేరింది. మంగళవారం ఉదయం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగింది. చివరకు బంగ్లాదేశ్‌పై 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. గ్రూప్- 1 నుంచి నేరుగా సెమీస్‌లోకి అడుగుపెట్టింది అఫ్గాన్ జట్టు. దీంతో ఆస్ట్రేలియా ఈ టోర్నీ నుంచి ఇంటిదారి పట్టింది.

- Advertisement -

గ్రూప్ -1లో మంగళవారం ఉదయం అఫ్గానిస్తాన్-బంగ్లాదేశ్‌ల మరో మ్యాచ్ సాగింది. కింగ్‌స్టన్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆప్గాన్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 115 పరుగులు చేసింది. ఓపెనర్ గుర్బాజ్ ఒంటరి పోరాటం చేశాడు. కేవలం 45 పరుగుల వ్యక్తిగత స్కోరు చేశాడు. చివర్లో కెప్టెన్ రషీద్‌ఖాన్ మూడు సిక్సర్లు కొట్టడంతో ఆ మాత్రం స్కోర్ సాధించింది. మిగతా ఆటగాళ్లు ఇబ్రహీం, అజ్మతుల్లా కాస్త పర్వాలేదనిపించారు. బంగ్లా బౌలర్లలో రిషద్ మోసిన్ ఒక్కడే మూడు వికెట్లు తీశాడు.

- Advertisement -

116 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ అందివచ్చిన అవకాశాన్ని చేజార్చుకుంది. కేవలం 12.1 ఓవర్లలో ఈ లక్ష్యాన్ని ఛేదిస్తే నేరుగా సెమీస్‌కు చేరేంది. చెత్తగా ఆడి అఫ్గాన్ ముందు చిత్తైంది. అయితే లక్ష్య చేధనలో పలుమార్లు వర్షం కురిసింది. దీంతో డక్‌‌వర్త్ లూయిస్ పద్దతిలో బంగ్లా లక్ష్యాన్ని 19 ఓవర్లలో 114 పరుగులకు కుదించారు.

Also Read: సెమీస్‌కు టీమిండియా.. ఆసీస్‌పై ఘనవిజయం..

టార్గెట్ చిన్నదే అయినా అందుకోవడంలో బంగ్లా జట్టు విఫలమైంది. ఓపెనర్ లిట్టన్‌దాస్ దాటిగా ఆడాడు. దాస్ దూకుడు చూసి సెమీస్‌కు బంగ్లా చేరుకోవడం ఖాయమని భావించారు అభిమానులు. ఈలోగా అప్గాన్ బౌలర్లు నవీన్ ఉల్ హుక్, రషీద్‌ఖాన్ చెలరేగారు. నాలుగు ఓవర్లలో నాలుగేసి వికెట్లు కూల్చి బంగ్లా ఆటగాళ్ల వెన్నులో వణుకు పుట్టించారు. వీరి ధాటికి 17.5 ఓవర్లకు బంగ్లా జట్టు 105 పరుగులకు ఆలౌటయ్యింది. ఫలితంగా ఎనిమిది పరుగుల తేడాతో బంగ్లాపై విజయం సాధించారు అఫ్గాన్ ఆటగాళ్లు.

ఈ గెలుపుతో అఫ్గాన్ సెమీస్‌లోకి అడుగుపెట్టింది. ఇదే గ్రూప్‌లో ఉన్న బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా జట్లు ఇంటిదారి పట్టాయి. సూపర్-8 మ్యాచ్‌లో ఆసీస్‌పై సంచలన విజయం సాధించింది అఫ్గాన్ జట్టు. ఇప్పుడు బంగ్లాను ఓడించి నేరుగా సెమీస్‌కు అర్హత సాధించడమేకాదు.. పరోక్షంగా కంగారూలను ఇంటికి పంపించింది. తొలిసారి టీ20 టోర్నమెంట్‌లో సెమీస్‌కు చేరి చరిత్ర సృష్టించింది అఫ్గాన్ జట్టు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News