Big Stories

Mamata Congratulates to KKR: కోల్‌కతా జట్టుకు మమత అభినందనలు.. బెంగాల్ అంతటా సంబరాలు..

Mamata Congratulates to KKR: దశాబ్దం తర్వాత కోల్‌కతా నైట్‌రైడర్స్ ఐపీఎల్ కప్ గెలవడంపై అభిమానుల ఆనందానికి హద్దు లేకుండా పోతోంది. ముఖ్యంగా బెంగాల్ అంతటా ఫ్యాన్స్ సంబరాలు అంబరాన్ని తాకాయి.

- Advertisement -

బెంగాల్ సీఎం మమతబెనర్జీ రియాక్ట్ అయ్యారు. నైట్ రైడర్స్ సాధించిన విజయంతో బెంగాల్ అంతటా సంబరాలు తెచ్చిపెట్టిందని సోషల్ మీడియాలో ప్రస్తావించారు. ఈసారి ఐపీఎల్‌లో రికార్డు స్థాయి ప్రదర్శన చేసిన ఆటగాళ్లకు, సిబ్బంది, ప్రాంచైజీలకు వ్యక్తిగత అభినందనలు తెలిపారు. రానున్నకాలంలో మరిన్ని విజయాలు సాధించాలని భావిస్తున్నట్లు అందులో ప్రస్తావించారు. 2014 తర్వాత మళ్లీ ఇప్పుడు నైట్‌రైడర్స్ కప్పు గెలిచింది.

- Advertisement -

మరోవైపు బాలీవుడ్ నటి, పంజాబ్ జట్టు సహ యాజమాని ప్రీతిజింటా.. షారూఖ్‌తోపాటు కేకేఆర్ టీమ్ సభ్యులకు అభినందనలు తెలిపారు. మూడోసారి టైటిల్ గెలవడం సంతోషంగా ఉందన్నారు. బాలీవుడ్ నుంచి చాలామంది ప్రముఖులు షారూఖ్‌కు తమ అభినందనలు తెలియజేశారు.

Also Read: KKR Captain Shreyas Iyer: కోల్ కతా కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ పేరు ఎక్కడ?

ఐపీఎల్‌లో ఇప్పటివరకు చెన్నై, ముంబై ఐదేసి టైటిళ్లు సాధించగా, కోల్‌కతా మూడోసారి గెలుపొందింది. ఐపీఎల్ ట్రోఫీ అందుకున్న వారిలో శ్రేయస్ అయ్యర్ ఎనిమిదో వ్యక్తి. అంతకుముందు కెప్టెన్లలో షేన్ వార్న్, గిల్‌క్రిస్ట్, ధోని, గంభీర్, రోహిత్ శర్మ, వార్నర్, హార్దిక్ పాండ్యా ఉన్నారు. ఇక ఛాంపియన్ జట్టు కేకేఆర్‌కు 20 కోట్ల ఫ్రైజ్ మనీ దక్కింది. రన్నరప్ సన్ రైజర్స్‌కు 12.5 కోట్ల రూపాయలను సొంతం చేసుకున్నాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News