Kedarnath Massive avalanche: ఉత్తరాఖండ్లో భారీ హిమపాతం సంభవించింది. ఆదివారం ఉదయం సరోవర్ కొండలపై నుంచి హిమపాతం దూసుకొచ్చింది. కేదార్నాథ్కు నాలుగు కిలోమీటర్ల వరకు దూసుకొచ్చింది. దీనివల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం జరగలేదని పోలీసు అధికారులు వెల్లడించారు.
ఉత్తరాఖండ్లో ప్రముఖ పుణ్యక్షేత్రం కేదార్నాథ్. అయితే ఈ క్షేత్రానికి సమీపంలో అనూహ్య ఘటన జరి గింది. కేదార్నాథ్ ఆలయానికి నాలుగు కిలోమీటర్ల ఎగువన గాంధీ సరోవర్పై మంచు ఉప్పెన విరుచుకు పడింది. పెద్ద మొత్తంలో మంచు కిందికి దూసుకొస్తున్నట్లు వీడియోల్లో కనిపించింది. ఆ తర్వాత హిమ పాతం కాస్త నెమ్మదించి అక్కడే ఆగిపోయింది. ఆలయ సందర్శన కోసం అక్కడి వెళ్లిన భక్తులు ఆయా దృశ్యాలను తమ తమ ఫోన్లలో బంధించారు. మరికొందరు ఆందోళనకు గురయ్యారు.
దీనివల్ల ఎలాంటి నష్టం జరగలేదని రుద్ర ప్రయాగ్ పోలీసు అధికారులు చెప్పుకొచ్చారు. కేదార్నాథ్ సహా ఆ ప్రాంతమంతా సురక్షితంగా ఉందన్నారు. హిమాలయ ప్రాంతంలో ఇలాంటి సాధారణమేనన్నారు. కాకపోతే కేదార్నాథ్ ధామ్ ప్రాంతంలో భద్రత మెరుగు పరుచుకోవాలని సూచించారు. గతేడాది కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయని గుర్తు చేశారు. వాతావరణ శాఖల నుంచి నివేదికలు తీసుకుని ఆ సమయంలో దేవాలయాలను సందర్శించడం మానుకుంటే బెటరని అంటున్నారు.
VIDEO | Uttarakhand: An avalanche occurred over Gandhi Sarovar in Kedarnath. No loss of life and property was reported. More details are awaited. pic.twitter.com/yfgTrYh0oc
— Press Trust of India (@PTI_News) June 30, 2024