Congress, Shiv Sena (UBT), NCP (SP) jointly contest assembly polls: ఈ సంవత్సరంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష కూటమి మహీ వికాస్ అఘాది(MVA) కలసి పోటీ చేస్తుందని ఎన్సీపీ(ఎస్పీ) వ్వవస్థాపకుడు శరద్ పవార్ ఆదివారం తెలిపారు. సీట్ల పంపకాలపై త్వరలో చర్చలు ప్రారంభమవుతాయని సీనియర్ నాయకుడు స్పష్టం చేశారు. శివసేన (UBT), NCP (శరద్చంద్ర పవార్), కాంగ్రెస్, ఇతరులతో కూడిన MVA, ఈ ఏడాది అక్టోబర్ లేదా నవంబర్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అధికార మహాయుతి కూటమిని గద్దె దించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
పూణేలో ఓ మీడియా సమావేశంలో శరద్ పవార్ మాట్లాడుతూ మహాభారతంలో అర్జునిడి లక్ష్యం కన్ను అని.. తమ దృష్టంతా అసెంబ్లీ ఎన్నికలపైనే ఉందని తెలిపారు. ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో మహా వికాస్ అఘాడి కూటమిలో భాగస్వామ్యమైన చిన్న పార్టీలకు సీట్లు ఇవ్వలేదని.. కానీ వారు శక్తికి మించి పనిచేశారన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో చిన్న పార్టీలకు కూడా ప్రాతినిధ్యం ఇస్తామన్నారు.
ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో MVA 48 స్థానాలకు గాను 31 స్థానాలను గెలుచుకుని అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. కాంగ్రెస్ అత్యధికంగా 13 సీట్లతో గెలుపొందగా, శివసేన (UBT) తొమ్మిది, ఎన్సీపీ ఎనిమిది స్థానాలను కైవసం చేసుకుంది.
మహా వికాస్ అఘాది కూటమి నవంబర్ 2019 నుంచి జూన్ 2022 వరకు మహారాష్ట్రంలో అధికారంలో ఉంది. ఏక్నాథ్ షిండే తిరుగుబాటు తర్వాత ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని ప్రభుత్వం కూలిపోయింది. మహాయుతి కూటమిని ఏర్పాటు చేసేందుకు బీజేపీకి చెందిన దేవేంద్ర ఫడ్నవీస్తో చేతులు కలిపి షిండే ముఖ్యమంత్రి అయ్యారు.
గత ఏడాది జూలైలో, అజిత్ పవార్ తన మామ శరద్ పవార్కు వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటుకు నాయకత్వం వహించిన తర్వాత పాలక ప్రభుత్వంలో చేరారు, దీంతో NCPలో చీలిక అనివార్యమైంది.
Also Read: లోక్సభలో ప్రతిపక్ష నేత ఎవరనేది కాంగ్రెస్ నిర్ణయం: శరద్ పవార్
ఇంతలో, శరద్ పవార్ ప్రభుత్వంలో మార్పు తీసుకురావడానికి ప్రతిపక్ష కూటమికి నైతిక బాధ్యత ఉందని శరద్ పవార్ నొక్కి చెప్పారు. సీట్ల పంపకంపై ఇంకా చర్చలు ప్రారంభం కావాల్సి ఉందని, త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పారు. శివసేన (UBT) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే కూడా కూటమి కొనసాగింపుపై ఇటీవల సూచన చేశారు.