CBI Arrested Hazaribagh School Principal and his vice in NEET-UG Paper Leak: నీట్-యూజీ పరీక్ష పేపర్ లీక్ కేసుకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. ఝార్ఖండ్లోని హజారీబాగ్లోని ఓ ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపాల్ ఎహ్సానుల్ హక్, వైస్ ప్రిన్సిపల్ ఆలం ఒయాసిస్ను సీబీఐ అరెస్ట్ చేసింది.
హజారీబాగ్లోని NEET-UG పరీక్షకు ప్రిన్సిపాల్ హక్ జిల్లా కోఆర్డినేటర్గా ఉండగా, వైస్ ప్రిన్సిపాల్ ఆలం ఒయాసిస్ స్కూల్కు సమన్వయకర్తగా ఉన్నారు. వీరిరువురిని అరెస్ట్ చేసిన అనంతరం బీహార్కు తరలించినట్లు తెలస్తోంది. ఇక పేపర్ లీకేజీకి సంబంధించి జిల్లాకు చెందిన మరో ఐదుగురిని సీబీఐ ప్రశ్నిస్తోంది.
ఈ విషయానికి సంబంధించి ఒయాసిస్ స్కూల్ ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ సహా మరికొందరు ఉపాధ్యాయులను సీబీఐ ప్రశ్నించిన ఒక రోజు తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది. జూన్ 26న, ఎనిమిది మంది సభ్యుల బృందం పాఠశాలను క్షుణ్ణంగా సందర్శించింది.
అదనంగా, ఈ బృందంలోని కొందరు సభ్యులు తమ విచారణలను జిల్లాలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ప్రధాన శాఖకు విస్తరించారు. ప్రశ్నపత్రాలను భద్రపరిచే బాధ్యత బ్యాంకు మేనేజర్దేనన్న నివేదికల కారణంగా ఈ సందర్శన జరిగినట్లు తెలుస్తోంది.
కాగా, నీట్-యూజీ పరీక్ష పేపర్ లీక్ కేసులో బీహార్లోని పాట్నాకు చెందిన ఇద్దరు వ్యక్తులను సీబీఐ గురువారం అరెస్టు చేసింది. వారిని మనీష్ కుమార్, అశుతోష్ కుమార్గా గుర్తించారు.
Also Read: నీట్పై చర్చకు ఇండియా కూటమి డిమాండ్
మే 5న నీట్ యూజీ పరీక్ష జరగగా జూన్ 4 న ఫలితాలు వెలువడ్డాయి. గ్రేస్ మార్కులు విషయంలో ఆందోళనలు నెలకొన్నాయి. అటు గ్రేస్ మార్కుల విషయంతో పాటు పేపర్ లీక్ అంశం దేశమంతటా పాకడంతో నీట్ పరీక్షను రద్దు చేయాలని ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో ఆందోళనలు చేపట్టాయి. ఆ అంశంపై సీబీఐ విచారణకు కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. దీంతో కేసు నమోదు చేసిన సీబీఐ ఇవాళ ఇద్దరిని అదుపులోకి తీసుకుంది.