Big Stories

Bus falls down from a mountain at Shimla: సిమ్లాలో ఘోరం ప్రమాదం, అదుపు తప్పిన బస్సు, నలుగురు మృతి

Bus falls down from a mountain at Shimla: హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బస్సులో ఉన్న నలుగురు ప్రయాణికులు స్పాట్‌లో మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను సమీపంలోని ఆసుపత్రికి పోలీసులు తరలించారు. అసలు ఎలా జరిగిందన్న డీటేల్స్‌లోకి వెళ్తే..

- Advertisement -

హిమాచల్‌ప్రదేశ్ ఆర్టీసీకి చెందిన బస్సు సిమ్లాలో కుద్దు నుంచి దిల్తారీకి వెళ్తోంది. అయితే ప్రయాణికులు తక్కువ సంఖ్యలో ఉన్నారు. ఈ క్రమంలో బస్సు జుబ్బల్‌లోని కెంచి ప్రాంతానికి రాగానే అదుపు తప్పి లోయలోకి పడిపోయింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

- Advertisement -

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటన జరిగిన ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్, కండక్టర్, ఓ మహిళ, నేపాలీ జాతీయుడు మృతి చెందినట్టు గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

ALSO READ: ఇంటర్నేషనల్ యోగా డే.. కేంద్ర మంత్రికి చేదు అనుభవం..

గాయపడినవారిని సమీపంలో ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తులో నిమగ్నమయ్యారు. ఆసుపత్రిలో కోలుకుంటున్న బాధితుల వద్దకు వెళ్లి ప్రమాదానికి దారి తీసిన కారణాలను అడిగి తెలుసుకుంటున్నారు పోలీసులు.

 

 

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News