Big Stories

Patna Boat Capsize: గంగా నదిలో పడవ బోల్తా.. ఆరుగురు గల్లంతు..

Boat Capsize in Patna: బీహార్‌లోని పాట్నాలో విషాదం చోటుచేసుకుంది. రాజధాని నగరానికి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న బార్హ్ పట్టణ సమీపంలోని గంగా నదిలో పడవ బోల్తా పడింది. మొత్తం 17 మంది ఈ పడవలో ప్రయాణిస్తుండగా పడవ బోల్తా పడింది.

- Advertisement -

దీంతో అందులోని 11 మంది ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. మిగిలిన ఆరుగురు గల్లంతైనట్లు సమాచారం. బార్హ్ ఉమానాథ్ ఘాట్ నుండి డయారాకు ప్రయాణిస్తోన్న సమయంలో పడవ బోల్తా పడిందని గల్తంతైన వారికోసం అన్వేషణ జరుగుతోందని అధికారులు తెలిపారు.

- Advertisement -

గత నెల ప్రారంభంలో బీహార్‌లోని మహావీర్ తోలా గ్రామ సమీపంలో గంగా నదిలో పడవ బోల్తా పడి ఇద్దరు వ్యక్తులు అదృశ్యమైన తర్వాత ఆదివారం ఈ సంఘటన జరిగింది.

ఉమానాథ్ గంగా ఘాట్ సమీపంలో ఉదయం 9.15 గంటలకు ఒకే కుటుంబానికి చెందిన 17 మంది ప్రయాణిస్తున్న పడవ మార్గమధ్యంలో బోల్తా పడడంతో ఈ ప్రమాదం జరిగిందని బార్హ్ సబ్ డివిజనల్ ఆఫీసర్ శుభం కుమార్ తెలిపారు.

సమాచారం అందుకున్న జిల్లా యంత్రాంగం, పోలీసు సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సహాయంతో రెస్క్యూ ఆపరేషన్‌లు ప్రారంభించి, బోటులో గల్లంతైన వారి ఆచూకీని కనిపెట్టినట్లు ఎస్‌డీఎం తెలిపారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News