Big Stories

Virudhunagar : బాణసంచా కేంద్రంలో భారీ పేలుడు.. నలుగురు సజీవదహనం

Virudhunagar Firecrakers Factory Blast : తమిళనాడులోని బాణసంచా తయారీకేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. విరుదునగర్ జిల్లాలోని సత్తూర్ కు సమీపంలో బందువార్ పట్టిలో ఉన్న బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు సజీవదహనమవ్వగా.. పలువురికి గాయాలైనట్లు తెలుస్తోంది.

- Advertisement -

ప్రమాదంపై సమాచారం అందుకున్న అధికారులు, పోలీసులు, వైద్య సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. భారీ పేలుడుకు బాణసంచా కేంద్రమంతా నేలమట్టమవ్వడంతో మృతుల సంఖ్య పెరగవచ్చని అంచనా వేశారు. ఘటనపై సత్తూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాద ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

- Advertisement -

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News