Big Stories

Smuggler : సీఎంతో కలిసి భోజనం చేసిన స్మగ్లర్‌.. ఫోటో వైరల్..

Smuggler : ఆ స్మగ్లర్ కలప చోరీ కేసులో అరెస్ట్ అయ్యాడు. రెండు రోజులపాటు జైల్లో ఉన్నాడు. ఆ తర్వాత బెయిల్ పై బయటకొచ్చాడు. ఇలా బయటకు వచ్చి కొన్నిరోజులకే సీఎంతో కలిసి భోజనం చేయడం కలకలం రేపుతోంది. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది.

- Advertisement -

మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఇటీవల సిధీ జిల్లాలో పర్యటించారు. పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. స్థానికులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. కలప స్మగ్లింగ్ కేసులో జైలుకు వెళ్లి వచ్చిన అరవింద్ గుప్తా అనే వ్యక్తి ఈ కార్యక్రమానికి వచ్చాడు. ముఖ్యమంత్రి పక్కనే కూర్చొని భోజనం కూడా చేశాడు. శివరాజ్ సింగ్ చౌహాన్ తో మాటలు కలిపాడు. ముచ్చటిస్తూ విందు భోజనం ఆరగించాడు.

- Advertisement -

అసలు విషయం తెలియని సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ మాటల మధ్యలో ఆ దొంగ వీపు కూడా తట్టారు. ఈ వార్త ఇప్పుడు వైరల్ గా మారింది. సీఎంతో కలిసి స్మగ్లర్ భోజనం చేసిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. భద్రతా సిబ్బంది కళ్లుగప్పి అరవింద్‌ గుప్తా అక్కడికి వచ్చినట్లు తెలుస్తోంది. ఓ స్మగ్లర్‌ ఇలా ముఖ్యమంత్రి పక్కనే కూర్చోవడంపై విమర్శలు వస్తున్నాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News